భువనగిరి : అమ్మహస్తం పథకం పూర్తిగా వినియోగదారులకు అందకుండాపోయింది. ప్రభుత్వం కొత్త పథకం తేకపోవడంతో ఇంకా ఆ పేరుతోనే కొన్ని రేషన్సరుకుల సరఫరా కొనసాగుతోంది. కానీ సరుకుల కుదింపుతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. పండగ సమయంలో సరుకుల కోసం రేషన్ దుకాణాలకు వెళ్లిన వారు ఉత్త చేతులతో తిరిగివస్తున్నారు. ఇక పండగలకు ఇచ్చే అదనపు కోటా గురించి పట్టించుకునేవారే లేకుండా పోయారు. గత ప్రభుత్వం సామాన్యుడిని అధిక ధరాభారం నుంచి రక్షించడానికి తె ల్లరేషన్కార్డులపై 9 రకాల సరుకులను 185రూపాయలకే అందించాలని అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి మొదటినుంచీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. తాజా పరిస్థితిలో 9 సరుకుల సంగతికి దిక్కులేకుండా పోయింది. కేవలం రెండు రకాల సరుకులతోనే ప్రజలు సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
తెలంగాణలో అతి పెద్ద పండగలైన బతుకమ్మ, దసరా పండగలకు ప్రజలు ఎక్కువగా పిండివంటలు చేస్తుంటారు. వీటికి అవసరమైన పామోలిన్, కందిపప్పు, ఉప్పు, కారం ఇలా ప్రధానమైన సరుకులు రేషన్ దుకాణాలలో అందుబాటులో ఉండడం లేదు. ఏడు నెలలుగా పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. ప్రతినెలా జిల్లాకు 900 టన్నుల పామోలిన్ రావాల్సి ఉంది. ఎన్నికల ముందు నుంచి సరఫరా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విషయంలో స్పష్టత లేకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్టు అధికారులు తెలుపుతున్నారు. కందిపప్పుది ఇదే పరిస్థితి. ఐదు నెలలుగా కందిపప్పు రావడం లేదు. కొత్త ప్రభుత్వం రావడం రవాణా టెండర్ల విషయంలో రేటు నిర్ణయం కాకపోవడంతో సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. పేద ప్రజలకు ప్రధాన అవసరమైన కందిపప్పు, పామోలిన్ రాకపోవడంతో బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు.
జిల్లాలో రేషన్కార్డుల పరిస్థితి..
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.36 లక్షల కుటుంబాలు ఉండగా, 10.02 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. బోగస్ యూనిట్లు, రేషన్కార్డుల తొలగింపు అనంతరం తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిసి 9,03,333 రేషన్కార్డులు, వాటిలో 32 లక్షల యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు 62 వేల పింక్ కార్డులు ఉన్నాయి. తెలుపు రంగుకార్డులపై కేవలం బియ్యం, అరకిలో చక్కర మాత్రమే సరఫరా చేస్తున్నారు. మిగతా నిత్యావసర సరుకులు సరఫరా లేకపోవడంతో వాటిని అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొంటున్నారు.
అందని ‘అమ్మహస్తం’
Published Fri, Sep 12 2014 2:44 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
‘అర్బన్’ పోరు రూ.3.55 కోట్లు
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్బాస్ బ్యూటీ (ఫోటోలు)
వాన నీటిలో ‘పరుపు’ ప్రయాణం.. వీడియో వైరల్
బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్ అరెస్ట్
దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా?
సంతకం చేయండి.. మార్పు డిమాండ్ చేయండి
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
వయనాడ్కే రాహుల్ టాటా!
తప్పక చదవండి
- చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
- ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
- మావోయిస్టుల ఏరివేతకు ‘జల్శక్తి’
- T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
- పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
- ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
- పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్కు అరుదైన గౌరవం
- పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
- Russia: భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
Advertisement