మూడో రోజు రెండు నామినేషన్లు

3rd Day Naminations In Medak  - Sakshi

మెదక్‌ లోక్‌సభకు రెండు నామినేషన్లు దాఖలు

22, 25 తేదీల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ

సాక్షి, మెదక్‌ రూరల్‌: ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో పోటీ చేసేందుకు బుధవారం మూడో రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ధర్మారెడ్డికి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి సంతోష్‌రెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థిగా సిద్దిపేటకు చెందిన బన్సీలాల్‌లు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణకు కౌటర్లను ఏర్పాటు చేశామన్నారు. కానీ 18, 19 తేదీల్లో నామినేషన్లు రాలేదన్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణకు సమయం ఉండగా 21, 23, 24 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. అందువల్ల 22, 25వ తేదీల్లో మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top