ఆదిలాబాద్ జిల్లా మామడ మండల కేంద్రంలోని మినీ గురుకులంలో ఉదయం అల్పాహారం తిని 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.
ఉదయం అల్పాహారం తిని 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా మామడ మండల కేంద్రంలోని మినీ గురుకులంలో 150 మంది బాలికలున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో అల్పాహారంగా ఇచ్చిన ఉప్మా తిన్న విద్యార్థులు 25 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు. అధికారులు వారందరినీ నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రమాదం లేదని, బాలికలకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు.