తాజాగా మరో 22 స్వైన్‌ప్లూ కేసులు | 22 fresh cases of swine flu reported in Telangana | Sakshi
Sakshi News home page

తాజాగా మరో 22 స్వైన్‌ప్లూ కేసులు

Feb 21 2017 8:10 PM | Updated on Sep 5 2017 4:16 AM

తాజాగా తెలంగాణాలో మరో 22 స్వైన్‌ప్లూ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్‌: తెలంగాణాలో మరో 22 స్వైన్‌ప్లూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకూ 648 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. మొత్తం 125 నమూనాల్లో 22 కేసుల్లో ఎచ్‌1ఎన్‌1 వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. గతేడాది ఆగస్టు 1 నుంచి నేటివరకూ 5,229 నమూనాల్లో 621 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్క మరణం కూడా నమోదవ్వలేదని బులిటెన్‌ విడుదల చేసింది. తగిన స్థాయిలో మందులు, సామాగ్రి అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement