కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ :15 మందికి గాయాలు
Feb 27 2016 10:24 AM | Updated on Aug 30 2018 3:58 PM
కమలాపూర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మిగిలిన వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూలీలు అందరూ మర్రిపల్లి గూడెంకు చెందిన వారు. వరంగల్ జిల్లాలో పనుల కోసం వెళుతుండగా ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement