నగరంలోని కూకట్పల్లి మలేషియా టౌన్ షిప్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు, బైక్ను ఢీకొట్టింది.
ఆర్టీసీ బస్సు ఢీ: యువకుడి మృతి
Dec 4 2015 11:45 AM | Updated on Sep 3 2017 1:29 PM
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి మలేషియా టౌన్ షిప్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు, బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్నాయక్(22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేష్ స్వస్థలం ఖమ్మం జిల్లా కాగా వారి కుటుంబం 20 సంవత్సరాల క్రితం కేపీహెచ్ బీ ఫోర్త్ ఫేజ్లో స్థిరపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement