breaking news
-
కరీంనగర్లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి
కరీంనగర్రూరల్/గోదావరిఖని: అత్తింటి వేధింపులను భరించలేక భార్య ఆత్మహత్య చేసుకోగా.. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త ఆదివారం మృతిచెందాడు. వారం రోజుల వ్యవధిలో దంపతులు మరణించడం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు..గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి కంబాల నరేశ్(30) ఏడాదిక్రితం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపలి్లకి చెందిన లింగంపల్లి మమత(29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖనిలోని గంగానగర్లో నివాసముండగా వరకట్నం కోసం కుటుంబంలో గొడవలేర్పడ్డాయి. సోదరుడు మహేశ్కు చెప్పడంతో రూ.లక్ష ఇచ్చినప్పటికి మమతపై కుటుంబసభ్యుల వేధింపులు ఆగకపోవడంతో ఈ నెల 15న నస్పూర్కాలనీలోని బంధువుల ఇంటికి మమత వెళ్లింది. మరుసటిరోజు ఇంటి యజమాని ఫోన్ చేసి నరేశ్ మెట్లమీదనుంచి కిందపడిపోయి ఆపస్మారకస్థితిలో ఉన్నాడని చెప్పడంతో మమత గోదావరిఖనికి వచ్చింది. సింగరేణి ఆస్పత్రిలో చేర్పించగా నరేశ్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 17న ఆస్పత్రిలో ఉన్న మమతను అత్తింటివాళ్లు దూషించడంతో మనస్తాపానికి గురై తీగలగుట్టపలి్లలోని రైల్వేట్రాక్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మమత తండ్రి పోషం ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. ఆదివారం వేకువజామున 4గంటలకు చికిత్స పొందుతూ భర్త నరేశ్ మృతిచెందాడు. దంపతులకు గోదావరిఖనిలో గొడవలు కావడంతోపాటు నరేశ్ శరీరంపై గాయాలుండటంతో తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాన్ని గోదావరిఖనికి పంపించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. నరేశ్ మృతిపై తండ్రి కంబాల భూమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరిఖని వన్టౌన్ ఎస్సై మనోహర్ కేసు నమోదు చేశారు. -
‘హీరో’ను చేస్తానని నమ్మించి మోసం
గచ్చిబౌలి: సినీ హీరో చేస్తానని నమ్మించి మోసం చేసిన కేసులో పోలీసులు ఓ మహిళకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందజేశారు. మరో సారి తెరపైకి వచ్చింది. తాజాగా ఓ మహిళను నిందితురాలిగా నానక్రాంగూడలో ఉంటూ ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఆకాష్ కుమార్ వర్మకు మాధవి అలియాస్ సిరిచందన పరిచయమైంది. ఆమె ద్వారా పరిచయమైన సాయి బొల్లా తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తన వద్ద ఓ కథ ఉందని హీరోగా అవకాశంకల్పిస్తానని నమ్మించి సినిమా రిజి్రస్టేషన్ పేరిట 2023 నుంచి 2025 వరకు దాదాపు రూ.93.35 లక్షలు తన అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సినిమా తీయకపోగా డబ్బులు తిరిగి వ్వకపోవడంతో బాధితుడి ఫిర్యాదుతో గత అక్టోబర్ 6న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు విస్తు పోయే విషయాలను కనుగొన్నారు. సాయి బొల్లా అనే వ్యక్తి మాధవి భర్తే అని గుర్తించారు. పక్కా వ్యూహం ప్రకారంమే భార్య భర్తలిద్దరూ కలిసి అకాశ్ కుమార్ వర్మను మోసగించినట్లు గుర్తించారు. మాధవిని నిందితురాలిగా పేర్కొంటూ కేసునమోదు చేశారు. రెండు రోజుల క్రితం స్టేషన్ బెయిల్ ఇచ్చారు. వీరి చేతిలో ఇంకెవరైనా మోస పోయి ఉంటే ఫిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ బాలరాజు సూచించారు. -
భార్యను హత్యచేసి నగలు ఎత్తుకెళ్లిన భర్త
చేగుంట (తూప్రాన్): ఇల్లరికం వచ్చిన భర్త భార్యను హత్యచేసి నగలను ఎత్తుకెళ్లాడు.ఈ సంఘటన మండల కేంద్రమైన చేగుంట స్టేషన్ రోడ్డులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన ఉప్పరి వరలక్ష్మి(35)కి, ఏపీ నెల్లూరుకు చెందిన త్రిమూర్తులుతో 2015లో వివాహమైంది. త్రిమూర్తులు చేగుంటకు ఇల్లరికం వచ్చి జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో వరలక్ష్మిని పారతో తలపై మోది హత్య చేశాడు. అనంతరం పుస్తెలతాడు, నగలు, డబ్బులు, సెల్ఫోన్ తీసుకొని పారిపోయాడు. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి పంచనామా నిర్వహించారు. మృతురాలి బావ సాయిబాబా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వరలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నీ భర్తను అడ్డు తొలగించుకో.. నిన్ను బాగా చూసుకుంటా!
చేవెళ్ల: ఇన్స్టాలో పరిచయమైన ప్రియుడి మోజులో పడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా నిందితులైన మృతుడి భార్య, ఆమె ప్రియుడిని జైలుకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శంకర్పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడెం కృష్ణ(35) జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి చంద్రారెడ్డినగర్లోని అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. ఇదిలా ఉండగా, చేవెళ్ల మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన శరత్ అనే వ్యక్తి చేవెళ్లలోని గణేశ్నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం రాజేశ్వరితో ఇతనికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఇతని మోజులో పడిన రాజేశ్వరి భర్తతో తరచూ గొడవ పడుతోంది. ఇదే అదనుగా భావించిన శరత్ నీ భర్తను అడ్డు తొలగించుకో, నిన్ను బాగా చూసుకుంటా అని నమ్మించాడు. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచి్చన భర్తతో రాజేశ్వరి గొడవ పడింది. అతను నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. గాఢ నిద్రలో ఉన్న కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. అతడు చనిపోయిన తర్వాత, తెల్లవారుజాము వరకూ ఇంట్లోనే ఉన్న ప్రియుడు ఆతర్వాత జారుకున్నాడు. శుక్రవారం ఉదయం ఏమీ తెలియనట్లు తన భర్త నిద్ర లేవడం లేదంటూ, ఆటోను పిలిపించి పట్నం మహేందర్రెడ్డి ఆస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని చెప్పడంతో, బాడీని ఇంటికి తీసుకెళ్లి బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. తన కొడుకు మృతికి కోడలే కారణమని కృష్ణ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ భూపాల్శ్రీధర్, డీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని, ఆమె ఫోన్ నంబర్ల ఆధారంగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడు శరత్తో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించింది. ఇరువురినీ కోర్టులో హాజరుపర్చిన అనంతరం శనివారం రిమాండ్కు తరలించారు. -
చంపుతానని బెదిరించి.. అన్నంత పనిచేసి
రామగిరి(మంథని): తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి ఇద్దరు కారణమని, ఎప్పటికైనా వారిద్దరినీ చంపుతానని సుమారు 15ఏళ్లపాటు బెదిరిస్తూ వచ్చిన ఆ వ్యక్తి అనుకున్నట్లే మొలుగూరి కొమురయ్య(58)ను హతమార్చాడు. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలోని బంధువుల వివాహ వేడుకకు హాజరైన కొమురయ్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రామగిరి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన మొలుగూరి కొమురయ్య, మొలుగురి సత్తయ్య అన్నదమ్ములు. కొమురయ్య బేగంపేటలో ఉంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సత్తయ్య సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లిలో కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సత్తయ్య బావమరిది బుర్ర రాజకొమురయ్య కొడుకు తిరుపతి 2011లో కమాన్పూర్ మండలం గుండారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే, తన కుమారుడికి కొమురయ్య, సత్తయ్య యాక్సిడెంట్ చేయించారని రాజకొమురయ్య అప్పట్నుంచి అనుమానిస్తూనే ఇద్దరితోనూ గొడపడుతూ వస్తున్నాడు. ఎలాగైనా ఇద్దరినీ చంపుతానని బెదిరించేవాడు. ఈనేపథ్యంలోనే సెంటినరీకాలనీలోని కమ్యూనిటీహాల్లో శనివారం జరిగే బంధువుల వివాహ వేడుకలకు కొమురయ్య, సత్తయ్య కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న రాజకొమురయ్య హఠాత్తుగా సత్తయ్యపై కత్తితో దాడి చేయగా కుడి చేతికి గాయమైంది. అక్కడే ఉన్న కొమురయ్య అడ్డుకునేందుకు యత్నించగా అతడిపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొమురయ్య ఘటన స్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బేగంపేట గ్రామానికి చెందిన బుర్ర రాజకొమురయ్య తన భర్తపై దాడి చేశాడని మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బంధువుల వివాహ వేడుకల్లో విగతజీవిగా పడిఉన్న కొమురయ్యను చూసి స్థానికులు కంటతడిపెట్టారు. -
25 ఏళ్ల యువతిని లొంగదీసుకున్న 50 ఏళ్ల వ్యక్తి..!
హైదరాబాద్: వివాహితను బెదిరించి లొంగదీసుకున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ పోలీసుల కథనం ప్రకారం... గుంటూరుకు చెందిన యువతి(25) ఎస్ఆర్నగర్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే క్రమంలో బంజారాహిల్స్కు చెందిన మల్లికార్జున్రెడ్డి(50) పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2024లో ఆమెకు వేరే వ్యక్తితో వివాహమైంది. గతేడాది నుంచి మల్లికార్జున్రెడ్డి మళ్లీ ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇటీవల మధురానగర్లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, చెప్పినట్లు వినకపోతే వాటిని కుటుంబసభ్యులకు పంపుతానని భయపెట్టి లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవాలని వేధించాడు. స్నేహితురాలి సాయంతో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఆర్నగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును మధురానగర్ పీఎస్కు బదిలీ చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు బలి
రంగారెడ్డి జిల్లా: గడువు ముగిసిన ఇంజక్షన్ ఇవ్వడంతో ఆరు నెలల బాలుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు, బాలుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం... చేవెళ్ల ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్రెడ్డి తన భార్య అఖిల, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు(ఆరు నెలలు)తో కలిసి బండ్లగూడ అభ్యుదయనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. మూడు రోజుల క్రితం కుమారుడికి జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న క్రేయాన్స్ చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్ అభిõÙక్ మహంతి ఆధ్వర్యంలో చిన్నారికి చికిత్స అందించి ఇంటికి పంపించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మరుసటిరోజు శిశువును మళ్లీ ఆసుపత్రికి తీసుకురాగా కొన్ని మందులు ఇచ్చి పంపించారు. జ్వరం తగ్గకపోవడంతో శనివారం ఉదయం విష్ణువర్ధన్రెడ్డి మరోసారి కుమారుడిని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు సెలైన్ ద్వారా వ్యాసోకన్ ఇంజక్షన్ ఇవ్వగా, కొద్దిసేపటికే శిశువు మృతి చెందాడు. తల్లిదండ్రులు అనుమానంతో ఇంజక్షన్ ను పరిశీలించగా, దాని గడువు ముగిసి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇద్దరు కుమార్తెల అనంతరం పుట్టిన మగబిడ్డ కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని తల్లిదండ్రులు బోరున విలపించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కుమారుడు మృతి చెందాడని, వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన మందులపై తేదీని సైతం గుర్తించలేని డాక్టర్ల సరి్టఫికెట్లను రద్దు చేసి, ఆసుపత్రిని సీజ్ చేయాలని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. -
కరెంటు పనికి వచ్చి.. యువతిపై కన్నేసి..
హైదరాబాద్: కరెంటు పని కోసం వచ్చిన ఓ ఎల్రక్టీషియన్ ఇంటి యజమాని కూతురిని ఇన్స్టాలో పరిచయం చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని ఓ బస్తీలో నివసించే యువతి(24) తమ ఇంట్లో కరెంటు పనులు, విద్యుద్దీపాల అలంకరణ కోసం ఎలక్రీషియన్ కొమ్ము వంశీకృష్ణ(20)ని సంప్రదించింది. కరెంటు పనులు చేసిన మరునాడు వంశీకృష్ణ ఆ యువతిని ఇన్స్టాలో హాయ్ అంటూ పలకరించాడు. ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. తనకు డబ్బులు అవసరం ఉన్నాయంటూ వంశీకృష్ణ ప్రారంభంలో రూ.20 వేల వరకు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను విడతలవారీగా బ్లాక్మెయిల్ చేస్తూ మరో రూ.2 లక్షలు కాజేశాడు. కొద్దిరోజుల తర్వాత మరో రూ.2 లక్షలు విడతలవారీగా తీసుకున్నాడు. పదే పదే డబ్బులు అడుగుతుండటంతో కొంతకాలంగా దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న వంశీకృష్ణ ఆమె కార్యాలయానికి వెళ్లే క్రమంలో రాకపోకలపై దృష్టిపెట్టి అడ్డగిస్తున్నాడు. మూడు రోజుల క్రితం బస్తీలో ఆటో కోసం ఎదురుచూస్తున్న ఆమెను అడ్డగించి కత్తితో బెదిరించగా భయంతో రూ.2 వేలు ఇచ్చింది. సదరు యువకుడితో తనకు ప్రాణహాని ఉందని, తాను బయట తిరగలేకపోతున్నానని, కార్యాలయానికి కూడా వెళ్లడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
చిన్నారి ప్రాణం తీసిన తోపులాట?
నాగర్కర్నూల్ క్రైం: దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ఆలయ నిర్వాహకులు, కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన తోపులాటలో కిందపడిన రెండు నెలల చిన్నారి మూ డురోజుల అనంతరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ నెల 18న మల్లన్న జాతర జరుగుతుండగా ఇదే గ్రామానికి చెందిన చంద్రకళ తన కూతురు కీర్తి, కుమారుడు గణేష్, కోడలు మౌనికతోపాటు రెండు నెలల చిన్నారి (మనుమరాలు)తో కలిసి మల్లన్న దర్శనానికి వెళ్లింది. అయితే జాతర నిర్వాహకులు దర్శనానికి రూ.వంద చెల్లించాలని కోరగా నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కొందరు జాతర నిర్వాహకులు గణేష్, చంద్రకళను కొబ్బరికాయల రూంలోకి తీసుకెళ్లి గణేష్ను చితకబాదారు. కొబ్బరికాయల రూంలో దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారాయి. కొబ్బరి కాయల రూం బయట ఉన్న చంద్రకళ కోడలు మౌనిక, రెండు నెలల మనుమరాలు, కూతురు కీర్తి గణేష్ను కొట్టవద్దని అడ్డు వెళ్లగా జాతర నిర్వాహకులు తోసివేయ డంతో రెండు నెలల చిన్నారితో సహా అందరూ కిందపడిపో యారు. ఈ క్రమంలోనే చిన్నారికి అంతర్గతంగా గాయాలయ్యాయని బాధితులు ఆరో పించారు. అయితే శనివారం ఉదయం ఇంట్లోనే చిన్నారి అనుమానా స్పద స్థితిలో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్లో ఆలయ నిర్వాహకులు దాడి చేయ డంతోనే చిన్నారి మృతి చెందిందని ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గోవర్ధన్ అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.జిల్లా ఆస్పత్రి ఎదుట ధర్నాబాధిత కుటుంబసభ్యులను డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ పరామర్శించి బాధితులకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
అమ్మకు భారం కావొద్దని..
చెన్నూర్: చిన్నప్పుడే నాన్న వదిలేసి వెళ్లాడు. అమ్మే కూలీ పనులు చేస్తూ.. ఇద్దరు కొడుకులను పోషిస్తూ డిగ్రీ వరకు చదివించింది. అమ్మమ్మ కూడా వీరికి సాయంగా ఉంటోంది. పెద్ద కొడుకు ఇటీవలే ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చిన్న కొడుకు రెండేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ రాసినా ఉద్యోగానికి ఎంపిక కాలేదు. దీంతో మనస్తాపం చెందిన నిరుద్యోగి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్లో జరిగింది. పట్టణంలోని కోటబొగూడ కాలనీకి చెందిన ఒద్ది కిరణ్ (24) డిగ్రీ పూర్తి చేశాడు. తల్లి కష్టాన్ని చూడలేక ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్–2, 3, 4 రాసినా రాలేదు. దీంతో మానసిక క్షోభకు గురయ్యాడు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు చెన్నూర్కు వచ్చాడు. తల్లి, అమ్మమ్మ కుటుంబ పోషణకు పడుతున్న కష్టాన్ని చూసి మనస్తాపం చెందాడు. ఈనెల 19న ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. -
బొగ్గుల శ్రీనివాస్ కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!
కూసుమంచి: ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లి ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంచేశారు. రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ నిర్వహించారు.ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మేకల వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించడం, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా ఆరా తీసినట్లు సమాచారం. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని బయటపడినట్లు తెలుస్తోంది.శ్రీనివాస్ మిత్రుడైన ఆయన తన వ్యాపార లావాదేవీల కోసం శ్రీనివాస్ జీఎస్టీ నంబర్ను దుర్వినియోగం చేస్తుండటంతో నిలదీయగా కక్ష పెంచుకుని అతనిని హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో శ్రీనివాస్ మృతి కేసు మిస్టరీ వీడనున్నట్లు తెలుస్తోంది. -
మద్యం తాగించి.. కత్తితో బెదిరించి
మణికొండ: షాపింగ్ చేద్దామంటూ మాయమాటలు చెప్పి.. ఆపై బలవంతంగా మద్యం తాగించి బాలికపై ఓ యువకుడు, ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి సర్కిల్ నెక్నాంపూర్ డివిజన్ పాషా కాలనీలో అమ్మమ్మ వద్ద ఓ బాలిక (16) నివసిస్తోంది. ఈ నెల 16న ఉదయం 8.30 గంటలకు పాఠశాలకు వెళ్తుతున్నానంటూ ఇంట్లోంచి వెళ్లింది. సా యంత్రం 4.30 గంటలవుతున్నా బాలిక ఇంటికి చేరుకోకపోవటంతో అమ్మమ్మతో పాటు ఆమె కూ తురు కాలనీలో తెలిసిన వారందరి వద్ద వెతికారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో నార్సింగి పో లీసులకు సోమవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పోలీసులు మంగళవారం విచారణ చేపట్టారు. ఈ నెల 7న షాపింగ్ కోసం చార్మినార్కు వెళ్లిన బాలికకు తలాబ్కట్టాకు చెందిన బాలుడి (16)తో పరిచయమైనట్లు తెలుసుకున్నారు. అప్పటినుంచి ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 16న ఆ బాలుడు పిలవడంతో ఇంట్లోంచి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. బాలుడి ఫోన్ నంబర్ను ట్రేసింగ్లో పెట్టగా చెంగిచర్లలో ఉన్నట్టు లొకేషన్ తెలిసింది. బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లి బాలికను నిందితులు ఇమ్రాన్ (23) ఇద్దరు బాలుర (16)ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన మరో బాలుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను గురువారం కోర్టు ఎదుట హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. నిందితుడు ఇమ్రాన్పై పలు పోలీస్స్టేషన్లలో దోపిడీ, దొంగతనం, శారీరక నేరం వంటి కేసులతో పాటు రౌడీïÙట్ ఉందని వారు వివరించారు. అసలు ఏం జరిగింది? బాధితురాలు బాలికను తలాబ్కట్టకు చెందిన బాలుడు చార్మినార్కు పిలిపించుకున్నాడు. మదీనాతో పాటు చారి్మనార్ చుట్టు పక్కల రాత్రి వరకు ఇద్దరూ కలిసితిరిగారు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటోలో ఘట్కేసర్ మండలం చెంగిచర్లకు వెళ్లారు. అక్కడి డబుల్ బెడ్రూం గృహాల్లోకి బాలికను తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి, కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి
చివ్వెంల(సూర్యాపేట): తనను దూరం పెడుతోందనే అక్కసుతో లా విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిపై ప్రేమెన్మాది సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బోయిండ్ల మహేశ్, సమీప గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల సభ్యులకు తెలియడంతో ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఆ యువతి హైదరాబాద్లో లా నాల్గవ సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఆమె స్వగ్రామానికి వచ్చింది. అక్కడ నుంచి చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలోని స్నేహనగర్లో అద్దెకు ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చి ఉంటోంది. తాను ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందని ఆమెపై మహేశ్ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మహేశ్ సూర్యాపేట పట్టణంలోని ఓ షాపులో సుత్తి కొనుగోలు చేసి గురువారం ఆ యువతి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. యువతి అక్క, బావ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో తనతో తెచ్చుకున్న సుత్తితో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె కేకలు వేయడంతో ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారు వచ్చి మహేశ్ను పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని యువతిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. మహేశ్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు. -
కేసులు పెట్టిందని.. కక్ష పెంచుకొని..
హస్తినాపురం: తనపై కేసులు పెట్టి.. తన జీవితాన్ని నాశనం చేసి... తన తల్లిచావుకు కారణమైందంటూ మాజీ భార్యను కత్తితో తలపై నరికి పడక గదిలోనే అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ తోట మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన మహేశ్, మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా బల్లాపూర్ ప్రాంతానికి చెందిన సునీత (29)లకు 2022లో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగా, కెనడాకు వెళ్లారు. కుటుంబ కలహాల కారణంగా వారి దాంపత్య జీవితం సాఫీగా సాగలేదు. దీంతో కెనడా వెళ్లిన 4రోజులకే సునీత తిరిగి ఇండియాకు వచ్చింది. తన స్వగ్రామమైన బల్లాపూర్ పీఎస్లో తనను మహేశ్ వేధింపులకు గురిచేస్తున్నాడని కేసు పెట్టింది. 2024 డిసెంబర్లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. 2025 ఏప్రిల్లో సునీత రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు చెందిన శ్రీనివాస్ను రెండో వివాహం చేసుకుని హరిహరపురంలోని కెఎన్ఆర్ మెడోస్ గ్రీన్సిటీ కాలనీలోని అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. కాగా 2025 మార్చి నెలలో మహేశ్ తల్లి గుండెపోటుతో మరణించడంతో కెనడా నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు. తనపై మాజీ భార్య సునీత క్రిమినల్ కేసులు పెట్టడం మూలంగానే తన తల్లి మృతి చెందిందని, తన జీవితం ఆగమైందని, తనను వేధింపులకు గురిచేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తోందని భావించి సునీతపై మహేశ్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సునీతను హతమార్చాలని నెల రోజుల క్రితం తుర్కయంజాల్లోని ఓబాయ్స్ హాస్టల్లో ఉంటూ సునీత కదలికలను గమనిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఆమె నివాసం ఉంటున్న ఇంటికివెళ్లాడు.ఇంట్లోని పడకగదిలో సునీత కనిపించడంతో తనవెంట తెచ్చుకున్న కత్తితో తలపై విచక్షణారహితంగా నరకడంతో సునీత బెడ్పైనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గమనించిన సునీత అత్త భయబ్రాంతులకు గురై ఇరుగుపొరుగువారికి చెప్పడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి ఇంట్లోనే తలుపునకు గడియపెట్టి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను గదిలో పోసి తానూ ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరించాడు. దీంతో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లడంతో వెంటనే పక్కనే ఉన్న బాత్రూమ్లోకి వెళ్లి తాను కాల్చుకుంటానని పోలీసులను బెదిరించసాగాడు. పోలీసులు మహేశ్కు నచ్చజెప్పి బయటికి రప్పించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. -
అభ్యంతరకరంగా రీల్స్.. ఇద్దరు యువకుల అరెస్ట్
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు మహా శివరాత్రి రోజు శివుడికి మాదకద్రవ్యాలను ప్రసాదంగా పెడుతున్నామంటూ రీల్స్ చేసిన ఇద్దరు యువకులు కటకటాలపాలయ్యారు. ఇన్స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జంగమ్మెట్ రవీందర్ నాయక్ నగర్ కాలనీకి చెందిన సభావత్ శ్రీచరణ్(, వడ్త్యా విజయ్ కృష్ణ జిమ్లో పని చేసేవారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న వీరు శంషాబాద్ శివారులోని ఓ శివాలయానికి వెళ్లి ‘శివుడికి అందరూ కొబ్బరి కాయలు కొడతారు...కాని మేము స్పెషల్ ప్రసాదం పెడుతున్నామంటూ గంజాయి’ చూపుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్గా మారిన ఈ వీడియోను చూసిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు చార్మినార్ జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం ఫలక్నుమా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫేమస్ కావడం కోసం ఎంతకైనా తెగిస్తారా...? –సీపీ సజ్జనార్ దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా...? ఫేమస్ కావడం కోసం ఎంతకైనా తెగిస్తారా...? అంటూ ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మహా శివరాత్రి భక్తికి నిదర్శనం...ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు...ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం! ఒక్కసారి ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగిస్తే...జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది.లైక్ల కోసం–లోకాన్ని మరిచి...వ్యూస్ కోసం–విలువలనే వదిలి..రీల్స్ కోసం–రోడ్డున పడి...మత్తులో మునిగి–జీవితాలను నాశనం చేసుకుంటారా!? చెప్పండి. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి...వ్యసనాలకు వాకిలిగా కాదు’......అంటూ చెప్పుకొచ్చారు. -
సిద్ధార్థ్రెడ్డికి జైలు
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా తేలుస్తూ, అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. తుది తీర్పును వెల్లడించింది. మెరిట్స్ లేవంటూ సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది. గత నవంబర్లో వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు–12 కీలక పాయింట్లు జస్టిస్ మనోజ్ మిశ్రా తీర్పును చదువుతూ 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు వెల్లడించారు. హత్య అనే వాదన చెల్లదు: ప్రత్యూషను గొంతు నులిమి చంపారన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు. హత్య కోణాన్ని కోర్టు తోసిపుచ్చింది. విషమే ప్రాణం తీసింది: అందుబాటులో ఉన్న మెడికల్ రిపోర్టులు, ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం.. ఆమె మరణం కచ్చితంగా విషం తీసుకోవడం వల్లనే సంభవించినట్లు రూఢీ అయ్యింది. అత్యాచారం జరగలేదు: సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూ షపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాలేదు. ఆలస్యపు ఆరోపణలు: కేసు విచారణ చాలా కాలం జరిగా క, ఆలస్యంగా అత్యాచారం, హత్య జరిగిందంటూ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవడం కష్టసాధ్యం. డాక్టర్ మునిస్వామిపై ఆగ్రహం: ఈ కేసులో అత్యంత కీలకమైన పోస్టుమార్టం నివేదికను అందించిన డాక్టర్ బి.మునిస్వామి తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆయన సమర్పించిన నివేదిక ’అన్ప్రొఫెషనల్’గా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముందస్తు లీకులు: నివేదికను అధికారికంగా సమర్పించకముందే, అసంపూర్తి సమాచారాన్ని బయటపెట్టడం వల్ల కేసు దారి మళ్లిందని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. సాక్షి నం. 34 కీలకం: సాక్షి నంబర్ 34 వాంగ్మూలం విశ్వసనీయంగా ఉందని, అది తీర్పులో కీలకపాత్ర పోషించిందని ధర్మాసనం తెలిపింది. నిందితుడికి వ్యతిరేకంగా: పరిస్థితుల ప్రభావం, సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కాదు: కూల్డ్రింక్లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న డిఫెన్స్ వాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. విషం కొన్నది అతడే: ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన ’నొవాక్రాన్’అనే పురుగుల మందును సిద్ధార్థ్ రెడ్డే కొనుగోలు చేశాడన్న విషయం రుజువైంది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమే. ఆ తీర్పు వర్తించదు: వెల్లూరు కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసులో అన్వయించుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. సర్వైవింగ్ పార్ట్నర్దే బాధ్యత: ఇది అత్యంత కీలకమైన అంశం. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. అందులో ఒకరు చనిపోయి, మరొకరు బతికితే.. చట్టప్రకారం బతికున్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు. ఈ చట్టపరమైన అంశం ఆధారంగానే సిద్ధార్థ్రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది.ఆ రోజు ఏం జరిగింది? 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం.. సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అప్పుడప్పుడే వెండితెరపై తళుక్కుమంటున్న యువనటి ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిలు పెద్దలు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో ఆత్మహత్యకు యత్నించారు. కూల్డ్రింక్లో విషం (పురుగుల మందు) కలుపుకొని తాగారు. వెంటనే ఇద్దరినీ హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్నుమూసింది. సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూష మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, సిద్ధార్థ్ రెడ్డే ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసును నీరుగారుస్తున్నారని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. తొలుత ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు.. సిద్ధార్థ్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన దోషిగా తేల్చుతూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లగా, శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. -
జట్టుగా చందా... గుట్టుగా గాంజా దందా!
సాక్షి, హైదరాబాద్: మత్తుమహమ్మారికి బలవుతున్న విద్యార్థులు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. కొందరు విద్యార్థులు కలిసి డబ్బులు పోగు చేసి గంజాయి కొనుగోలు చేసి విక్రయించడం వంటి అత్యంత ప్రమాదకర ధోరణిని వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (డబ్ల్యూఎన్పీఎస్) ప్రత్యేక బృందం బయటపెట్టింది. దీనిపై విస్తుపోయే విషయాలు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఈగల్ డైరెక్టర్ సందీప్శాండిల్య ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్లడించారు. పట్టుబడిన విద్యార్థులు తొలుత వినియోగదారులుగా మొదలై, పెడ్లర్లుగా మారి ఆ తర్వాత పెద్ద సరఫరాదారుల దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బృందం ముగ్గురిని అరెస్టు చేసి 36.878 కిలోల గంజాయి స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. వరంగల్ మీదుగా కరీంనగర్కు గంజాయి తరలిస్తుండగా వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కరీంనగర్కు చెందిన బీటెక్ విద్యార్థి బుచ్చల ఆదిత్య అలియాస్ ఇంద్ర (20), ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి గొల్లపల్లి నిఖిల్ అలియాస్ చింటు (19) పట్టుబడ్డారు. వీరిచ్చిన సమాచారంతో మరొక నిందితుడు వడ్లకొండ యశ్వంత్ అలియాస్ మింటును పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అరెస్టు చేశారు. ఇతను ఇంతకు ముందు రెండు ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్) కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రాథమిక విచారణలో బుచ్చల ఆదిత్య పలు విషయాలు వెల్లడించాడు. మొదటగా అలవాటు.. ఆ తర్వాత విక్రయాలు బీటెక్ మొదటి సంవత్సరంలో ఉండగా హాస్టల్మేట్ అమ్ముల త్రినేశ్ ద్వారా ఆదిత్య గంజాయికి అలవాటుపడ్డాడు. ఆ తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి గంజాయి కొనుగోలు చేసి విక్రయించాలని ప్రణాళిక రూపొందించాడు. ఆదిత్య రూ.11,600 ఇవ్వడంతోపాటు తన స్నేహితులు గొల్లపల్లి నిఖిల్ (రూ.12,000), వడ్లకొండ యశ్వంత్ (రూ.15000), అమ్ముల త్రినేశ్ (రూ.2000), సుందరగిరి సంజయ్ (రూ.30,000), అజయ్ (రూ.5,000), సిద్ధూ (రూ.2,000), శ్రీధర్ (రూ.3,000)...ఇలా మొత్తం రూ.80,600 జమ చేశారు. ఈ డబ్బుతో కరీంనగర్కు చెందిన, ప్రస్తుతం ఒడిశాలోని పసుపులంక ప్రాంతంలో నివసిస్తున్న కలవేన ప్రవీణ్ కుమార్ అలియాస్ చంటి ద్వారా గంజాయి కిలో రూ.2వేల చొప్పున కొనుగోలు చేశారు. ఈ గంజాయిని కొంత వాళ్లు వాడుకునేందుకు పెట్టుకుని మరికొంత జల్సాలు చేసేందుకుగాను ఈజీ మనీ కోసం హైదరాబాద్ , కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు విక్రయిస్తున్నారు. గతంలోనూ 2025 జనవరి, జూలై, డిసెంబర్ నెలల్లో 12 కిలోల చొప్పున మూడు సార్లు గంజాయి కొనుగోలు చేసి మేడ్చల్, కరీంనగర్ జిల్లాల పరిసరాల్లోని విద్యార్థులకు విక్రయించినట్టు విచారణలో బయటపడింది. దీంతో అమ్ముల త్రినేశ్, సుందరగిరి సంజయ్, అజయ్, సిద్ధూ, శ్రీధర్తోపాటు వీరికి గంజాయి సరఫరా చేస్తున్న ప్రవీణ్ కుమార్, ఒడిశాకు చెందిన భగవాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతను రక్షించడంలో, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్ధారించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని, డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే 1908 టోల్ఫ్రీ నంబర్లో లేదా 8712671111లో సమాచారం ఇవ్వాలని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య సూచించారు. -
ఇంట్లో మృతదేహం.. బయట తలుపునకు తాళం
మూసాపేట (హైదరాబాద్): మృతదేహాన్ని నాలుగు రోజులపాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఇంట్లోనే ఉంచుకోవటంతో దుర్వాసన వెలువడి.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివేకానందనగర్, రామకృష్ణనగర్ వీధిలో శ్రీసాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో మూడవ అంతస్తులోని అద్దె ఇంట్లో తల్లి శమంతకమణి, ముగ్గురు పిల్లలు జయరాం, శైలజ, సునీతలతో నివాసం ఉంటోంది. భర్త రిటైర్డ్ ఎస్ఐగా చేసి గతంలోనే మరణించాడు. భర్తకు వచ్చే పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. పిల్లలు ముగ్గురికి వివాహం కాలేదు. ఇటీవల అనారోగ్యంతో కుమార్తె శైలజ (50) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి తలుపునకు తాళం వేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు ఆదివారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపుతట్టగా సోమవారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తలుపు వేసుకున్నారు. సోమవారం కూడా మృతదేహాన్ని అలాగే ఉంచటంతో దుర్వాసన ఎక్కువైంది. దీంతో పోలీసులు ఇంటికి వచ్చి మృతదేహాన్ని తరలించాలని సూచించారు. పలు విధాలుగా వారికి నచ్చజెప్పటంతో చివరికి వారి సొంత ఊరు కైకలూరికి అంబులెన్స్లో తరలించారు. అయితే గతంలో వాచ్మన్పై దాడి చేసింది కూడా వీరేనని, అద్దె డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వటం లేదని స్థానికులు తెలుపుతున్నారు. -
పోలీసులకు చిక్కిన హెచ్సీయూ ల్యాప్టాప్ దొంగలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాప్టాప్స్ను చోరీ చేసిన దొంగలను గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. సీఆర్ రావు ఎఐఎమ్ఎస్ ప్రాంగణంలో జరిగిన ఈ చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం దొంగిలించిన 60 ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కూకట్పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్ (30) తో పాటు, సాయి చరణ్ (19), అశ్విన్ రావు (19) అనే ఇద్దరు విద్యార్థులు కలిసి ఈ దొంగతానానికి పాల్పడినట్లు గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ బాలరాజు తెలిపారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వీరిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా పటిష్ట బందోబస్తు ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫిబ్రవరి 8న రాత్రి దొంగతనం జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.ఈ ఘటనపై ఈ నెల 9న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్లు 331(4), 305(ఎ) కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. -
షవర్కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ స్టూడెంట్ బలవన్మరణంచింతల్: పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కొంపల్లిలో నివాసముంటున్న అశోక్బాబు కుమార్తె నాగలిఖిత (17) జీడిమెట్లలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తన గదిలో చదువుకోవడానికి వెళ్లింది. కాసేపటి తరువాత చెల్లెలు గీతిక సాయి గది తలుపు తట్టగా స్పందన రాలేదు. అపార్ట్మెంట్ వాచ్మన్ సహాయంతో తలుపు తాళం విరగొట్టి లోపలికి వెళ్లగా చున్నీని మెడకు కట్టుకొని మంచానికి చున్నీని కట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. షవర్కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య ఫిలింనగర్: ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని షవర్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫిలింనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. వరంగల్ మహబూబాబాద్కు చెందిన గుగులోత్ సంధ్యారాణి(20) షేక్పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. సమీపంలోని ఫాల్కన్ వ్యాలీ కాలనీలో హాస్టల్లో ఉంటోంది. ఆదివారం ఉదయం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి బ్రేక్పాస్ట్ చేసిన అనంతరం సెలవు దినం కావడంతో అంతా పడుకున్నారు. అదే సమయంలో సంధ్యారాణి బాత్రూమ్లోకి వెళ్లి చున్నీతో షవర్కు ఉరేసుకుంది. కాసేపటి తరువాత మిత్రులు బాత్రూమ్ తట్టగా లోపలి నుంచి గడియ వేసి ఉంది.దీంతో హాస్టల్ యజమానికి సమాచారం ఇచ్చారు. బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా షవర్కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. దీంతో ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందజేశారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఈ చావుపై ఎలాంటి విచారణ చేయవద్దని మృతురాలు వాట్సప్ మెసేజ్ పెట్టింది. ఈ మేరకు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తంచేశారు. కళాశాల యాజమాన్యం, వేధింపుల వల్లనే తన కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతి కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య వేరేవాడితో ఉంటుందని..!
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ నడిబొడ్డున పట్టపగలు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోరె విశ్వనాథ్ (30), ఇదే మండలం వడ్డెరకాలనీకి చెందిన లక్ష్మి ఇద్దరూ కలిసి జగిత్యాల బైపాస్రోడ్లోని శ్రీరాంనగర్లో నివాసం ఉంటున్నారు.కాగా, లక్ష్మీకి గతంలో వడ్డెరకాలనీకి చెందిన గంగాధర్తో వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. 9 నెలల క్రితం లక్ష్మీకి ఇన్స్ట్రాగామ్లో విశ్వనాథ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయారు. పోలీసులు పిలిపించి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి లక్ష్మీని భర్తకు అప్పగించారు. కానీ, లక్ష్మి భర్త వద్ద ఉండకుండా మళ్లీ విశ్వనాథ్తో కలిసి శ్రీరాంనగర్లో ఉంటున్నారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా విశ్వనాథ్, లక్ష్మి పెంబట్ల కోనాపూర్ దుబ్బరాజేశ్వరస్వామిని దర్శించుకుని జగిత్యాలకు వచ్చారు. బైపాస్రోడ్లో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా గంగాధర్తో పాటు అతడి బంధువులు మరో ఇద్దరు విశ్వనాథ్పై కర్రలతో దాడి చేశారు. తలకు తీవ్రగాయాలు కావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. లక్ష్మీకి సైతం గాయాలయ్యాయి. ఘటన స్థలాన్ని పట్టణ సీఐ కరుణాకర్ పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడి తండ్రి బోరె చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
‘ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ను ఎవరో కొట్టి చంపారు’
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి శనివారం కారు దూసుకెళ్లడంతో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (48) మృతిచెందిన ఘటనపై ఆయన సోదరులు అబ్దుల్లా, సుధాకర్ ఆదివారం కూసుమంచి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ సోదరుడు శ్రీనివాస్ తల, ముఖంతోపాటు ఎడమ చేతిపై గాయాలున్నాయని.. గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. శ్రీనివాస్ మృతదేహానికి నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సోదరులకు అప్పగించగా వారు నంద్యాల జిల్లాలోని స్వగ్రామం అల్లూరుకు తీసుకెళ్లారు. కారులో నుంచి ఒడ్డుకు వచ్చి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని, విచారణ వేగవంతం చేసి త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి వస్తూ.. శ్రీనివాస్ ప్రయాణించిన ఏపీ 16 డీపీ 2345 కారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వచ్చినట్లు టోల్ప్లాజా సీసీ పుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ కారు రిజిస్టేషన్ ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన వేణుమాధవరెడ్డిదిగా గుర్తించారని తెలిసింది. కారు జాతీయ రహదారిపై వెళ్లకుండా నాయకన్గూడెం నుంచి పాలేరు రాష్ట్ర రహదారిపై రావడం, రిజర్వాయర్లో పడిపోయాక కారు నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పరారవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ గతంలో హైదరాబాద్లో కండక్టర్గా ఉద్యోగం చేసేవాడని, ఆ తర్వాత ఉద్యోగం నచ్చక వదిలేసి పుస్తకాలు రాస్తున్నాడని సోదరులు పేర్కొన్నారు. -
కారుతో ఢీకొట్టి.. అతనిపైనే నడిపి..
హైదరాబాద్: ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి అరకిలోమీటరు వరకు లాక్కెళ్లడంతోపాటు అతనిపైనే కారును పోనిచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన మేరకు.. రాంపల్లి నీలగిరి హోమ్స్లో నివాసముంటున్న సతీష్(45), విజయ్కుమార్, రాజులు ఈ నెల 9న కారులో వెళుతుండగా మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద వెనుక నుంచి అతి వేగంగా దూసుకువచ్చిన కారు వీరి కారును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో వీరు వేగంగా వెళ్లి ఆ కారును అడ్డుకున్నారు. సతీష్ ఆ కారుకు ఎదురుగా నిలబడ్డాడు. అయితే నిందితులు వేగంగా వచ్చి సతీష్ను ఢీకొట్టడంతో అతను బానెట్ను గట్టిగా పట్టుకున్నాడు. అయినా అలాగే సుమారు అర కిలోమీటరు వరకు లాక్కెళ్లారు. అదుపుతప్పి సతీష్ పడిపోవడంతో నిర్దాక్షిణ్యంగా అతనిపైనే కారుపోనిచ్చారు. ఈ సంఘటనలో సతీష్ తీవ్రంగా గాయడ్డాడు. గమనించిన స్థానికులు కారును అడ్డుకొని అందులో ఉన్న మహేష్ తరుణ్లకు దేహశుద్ధి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను శనివారం రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
అత్తాపూర్లో అడ్వకేట్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్లో అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. సులేమాన్ నగర్లోని తన స్వంత కార్యాలయంలోనే కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలంలోనే ఖదీర్ మృతి చెందాడు. ఫ్యామిలీ గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే!
బెట్టింగ్ యాప్లు, సైబర్ మోసాలు, స్కాంలపై అలుపెరుగని పోరు సల్పుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహ కల్పించే, పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవలి కాలంలో విద్యావంతులు కూడా డిజిటల్ అరెస్ట్ స్కాం బారిన పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్న కేసులను అనేకం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలపై అవగాహన కల్పిస్తూ వచ్చిన ఒకవీడియోను ఎక్స్లో షేర్ చేశారు. దీంతో పాటు తన సందశాన్ని కూడా జోడించారు.‘‘పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.దయచేసి గమనించండి... పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరు, డబ్బులు అడగరు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. ఇలాంటి కాల్స్ వస్తే ఆందోళన చెందకండి.హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోను షేర్ చేసి, మీ వారికి కూడా అవగాహన కల్పించండి’’ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.దయచేసి గమనించండి...… pic.twitter.com/mzA6JNKBrk— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 14, 2026


