-
ఇంకో మార్గంలేకే ‘ఆత్మహత్య’
(హైదరాబాద్) గచ్చిబౌలి:‘‘పెళ్లి ఏర్పాట్లకు డబ్బు కోసం శక్తికి మించి ప్రయత్నించా. ఇంకో మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది’’ అని ఆత్మహత్యకు పాల్పడిన మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ‘‘23 మంది నుంచి తాను తీసుకున్న రూ.7.72 కోట్ల అప్పుల వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులు, కాబోయే భార్యకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.గచ్చిబౌలి పోలీసులు సూసైడ్ నోట్లోని వివరాల వెల్లడించారు. పెట్టుబడుల పేరిట చేసిన అప్పులను నా సోదరుడు మెట్ల సాయి పవన్కళ్యాణ్ తీర్చాలి. అయనకు పెట్టుబడి కోసం కొంత ఇచ్చాను కాబట్టి నన్ను మోసగాడిగా, అబద్ధాల కోరుగా మిగల్చకుండా అప్పులు తీర్చాలి. నేను ఎంతగానో ప్రేమించిన పెల్సియాకు అబద్దాలు చెప్పాను. క్యాన్సర్ వచ్చిందని తెలిసినా పెల్సియా నా వైపు నిలబడింది. వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టినా రిటర్న్స్ ఆలస్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్ర రూపం దాల్చాయి. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయకపోయినా ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్లో తిరిగి ఇవ్వాల్సి ఉంది. అన్ని విధాల ప్రయత్నించినా విఫలమయ్యాను. నాకు క్యాన్సర్ వచ్చింది అబద్ధం కాదు, ఢిల్లీలో చికిత్స తీసుకుంటే నయమైంది. 2023లో మళ్లీ క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో పెల్సియా(కాబోయే భార్య) నా వైపు నిలబడింది. ఆమె కారణంగా మూడు సంవత్సరాలు బతికాను. రెండు నెలలుగా పెళ్లిని నిలిపివేయడానికి ప్రయతి్నస్తున్నాను. డబ్బు ఇవ్వాల్సిన గడువు దగ్గర పడటం, పెళ్లికి ఖర్చులకు డబ్బు లేక పోవడంతో ఒత్తిడి భరించలేక నిర్ణయం తీసుకున్నాను. అందరూ నన్ను క్షమించండి’’ అని డెత్ స్టేట్ మెంట్లో పేర్కొన్నారు. ఆ మేసేజ్ను గచ్చిబౌలి పోలీసులు డెత్ స్టేట్మెంట్గా పరిగణిస్తున్నారు. మెట్ల వెంకట కృష్ణ శ్రీ సాయి మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యులకు మృతదేహన్ని అప్పగించారు. అంత్యక్రియల కోసం స్వస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి తరలించారు. -
తల్లి తిట్టిందని.. సైకిల్ యాత్ర!
కామారెడ్డి టౌన్ : తల్లి మందలించిందనే మనస్తాపంతో ఇంటి నుంచి సైకిల్పై పారిపోయాడు ఓ 14 ఏళ్ల బాలుడు. సైకిల్పైనే జాతీయ రహదారిపై 50 కిలో మీటర్లు ప్రయాణం సాగించాడు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆ బాలుడిని పోలీసులు గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్కు చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించడంతో పంతానికి పోయి మంగళవారం మధ్యాహ్నం సైకిల్పై ఇంటి నుంచి బయల్దేరాడు. సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించి అర్ధరాత్రి 11 గంటల సమయంలో కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ జంక్షన్కు చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఆపరేషన్ కవచ్ తనిఖీలు నిర్వహిస్తున్న దేవునిపల్లి పోలీసులు చీకట్లో ఒంటరిగా వెళ్తున్న బాలుడిని గమనించారు. అనుమానం వచ్చి ఆపి ప్రేమతో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తూ ఆందోళనలో ఉన్నవారు బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ నేరాల నియంత్రణతోపాటు పౌరుల రక్షణే ఆపరేషన్ కవచ్ ముఖ్య ఉద్దేశమన్నారు. అర్ధరాత్రి వేళ మానవీయ కోణంలో స్పందించి బాలుడి భవిష్యత్తును కాపాడిన దేవునిపల్లి పోలీసు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
స్వర్ణ పతకధారి.. చేసేది చోరీ!!
చౌటుప్పల్: ఎంబీఏ చదివాడు... గోల్డ్మెడల్ కూడా సాధించాడు...కానీ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. పట్టపగలే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్న దొంగ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులకు చిక్కాడు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా వేటపాలెం నలందానగర్కు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ సామ్రిచర్డ్ ఎంబీఏలో గోల్డ్మెడల్ సాధించాడు. కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి మన్సూరాబాద్ ప్రాంతంలో అద్దెకు ఉంటూ పలు వ్యాపారాలు చేశాడు. వాటిని విడిచి దొంగతనాలను వృత్తిగా ఎంచుకొని హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 62 దొంగతనాలు చేశాడు. అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినా తిరిగి బయటకు వచ్చి మళ్లీ చోరీలు చేసేవాడు. ఫిబ్రవరి 22న ఓ చోరీ కేసులో ఖమ్మం కోర్టుకు హాజరైన వంశీకృష్ణ తిరిగి హైదరాబాద్కు వెళ్తూ చౌటుప్పల్లోని వలిగొండ చౌరస్తా కంఠమహేశ్వర కాలనీలో నివాసముంటున్న లింగంపల్లి నర్సింహ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి బీరువాలో దాచిన రూ.14.20 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వంశీకృష్ణ సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తీసుకుని బుధవారం ఉదయం ఖమ్మం కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా అతడి కారును ఆపారు. వంశీకృష్ణ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చౌటుప్పల్లోని కంఠమహేశ్వర కాలనీలో లింగంపల్లి నర్సింహ ఇంట్లో చోరీ చేసింది తానేనని వంశీకృష్ణ ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.7 లక్షల నగదు, కారు, రెండు సెల్ఫోన్లు, ల్యాప్టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ.2.28లక్షల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో హాజరుపర్చి అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు.ఈ విలేకరుల సమావేశంలో సీఐ మన్మథకుమార్, సీసీఎస్ సీఐ ప్రవీణ్బాబు, ఎస్ఐలు యాదగిరి, వనం సైదులు, కుమారస్వామి పాల్గొన్నారు. కాగా, చోరీ చేసిన సొత్తుతో వంశీకృష్ణ వివిధ ప్రాంతాలకు వెళ్లి జల్సాలు చేసేవాడని, తన చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని తిరుగుతుండేవాడని, పేదలకు దాన ధర్మాలు చేయడం, అనాథ పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం కూడా చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. -
ట్రైనీ పైలట్పై ఇన్స్ట్రక్టర్ లైంగిక దాడి
సనత్నగర్(హైదరాబాద్): పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇన్స్ట్రక్టర్ ఓ ట్రైనీ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరువు తీసి కుటుంబ సభ్యులకు, కెరీర్కు నష్టం కలిగిస్తానంటూ బెదిరించాడు. ఇటీవల కాలంలో బెదిరింపులు ఎక్కువకావడంతో బాధితురాలు బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యువతి (20) బేగంపేటలోని ఏవియాకాన్స్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 2025లో శిక్షణ నిమిత్తం చేరింది. ఆ సమయంలో అక్కడ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న కేరళ రాష్ట్రం కొట్టాయం వైకోం ప్రాంతానికి చెందిన నసీముద్దీన్ అలియా స్ నసీం (30)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. నసీముద్దీ న్ను ఒక సోదరుడిగా ఆ యువతి భావించింది. ఈ చనువు తోనే బేగంపేట బ్రాహ్మణవాడీలో ఉండే నసీముద్దీన్ వద్దకు చదువుకోవడానికి తరచూ వెళ్తుండేది. గత ఏడాది డిసెంబర్ 27న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చదువుకోవడం కోసం ఆమె నసీముద్దీన్ వద్దకు వెళ్లింది. అయితే, 7.30 గంటల సమయంలో నసీముద్దీన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ‘ది లీగ్’లో జరిగే ఫుట్బాల్ మ్యాచ్కు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడు. అప్పటివరకు ఒంటరిగా చదువుకున్న యువతి.. నసీముద్దీన్ రాగానే తన స్నేహితురాలి వద్దకు వెళ్తానని చెప్పగా, ఇక్కడే ఉండాల్సిందిగా పట్టుబట్టాడు. తన కుటుంబసభ్యులు తనకు బలవంతంగా పెళ్లి చేశారని, తన భార్య మోసం చేసిందని, ఆమె నుంచి తరచూ తాను వేధింపులకు గురవుతున్నానని సదరు యువతిని నమ్మబలికాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఆత్మహత్య చేసుకుంటానని యువతిని బెదిరించాడు. దీంతో కొద్దిసేపు ఆమె అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో నసీముద్దీన్ తన జీవితం గురించి ఏడుస్తూ తలుపు గడియ పెట్టి ఆమెను బలవంతంగా కౌగిలించుకున్నాడు. తాను భయపడి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, అడ్డుకుని అరవకుండా నోరు మూసి, బలవంతంగా లైంగిక దాడి చేశాడు. జరిగిన సంఘటనను మరిచిపోయి ఏమీ జరగనట్లు ఉండాలని కోరాడు. నసీముద్దీన్ బెదిరింపులతో ఆమె భయపడి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత చదువుల కోసం దమ్మాయిగూడలో ఉండే మరో ఇన్స్ట్రక్టర్ సల్మాన్ ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో నసీముద్దీన్ దమ్మాయిగూడకు మకాం మార్చి అక్కడ కూడా ఆమెను బెదిరించడం కొనసాగించాడు. దీంతో మంగళవారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నసీముద్దీన్పై బీఎన్ఎస్ సెక్షన్ 64(2)(ఎఫ్), 351 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏంటి కిరణ్.. ఇలా చేశావ్?
అదనపు కట్నం డిమాండ్ చేస్తూ ఓ యువకుడు పెళ్లికి రెండ్రోజుల ముందు పరారయ్యాడు. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. తమకు న్యా యం చేయాలంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆ యువకుడి ఇంటి ఎదుట అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో మంగళవారం చోటు చేసుకుంది.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్కు చెందిన వీరబోయిన రాజయ్య రెండో కుమారుడు కిరణ్కు, ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన పొన్నాల రాజయ్య కూతురితో వివాహం నిశ్చయమైంది. వరకట్నంగా రూ.26 లక్షలు, రెండున్నర తులాల బంగారం ఇచ్చే ఒప్పందంతో నిశ్చితార్థం చేసుకుని మార్చి 6న వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. నిశ్చితార్థ సమయంలో రూ.10 లక్షల నగదు, అరతులం బంగారు ఉంగరం, రూ.72 వేల విలువ గల గొర్రెలు ముట్టజెప్పారు. ఆ తర్వాత తనకు అదనంగా మరో రూ.9 లక్షలు కావాలని కిరణ్ డిమాండ్ చేశాడు.తాము అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో పెళ్లికి రెండ్రోజుల ముందు మార్చి 4న కిరణ్ పరారయ్యాడని అతడి తల్లిదండ్రులు తమకు చెప్పడంతో మార్చి 6న జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కట్నం కోసమే కిరణ్ను తల్లిదండ్రులే దాచిపెట్టారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, మార్చి 4న కిరణ్పై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. ఈ ఘటనపై ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు! -
తమ్ముడికి రూ.26 లక్షల అప్పు ఇచ్చిన అక్క..!
హైదరాబాద్: తమ్ముడు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో ఓ వివాహిత అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్కు చెందిన లావ్యణ్య(35) తన తమ్ముడు స్వామికి ఇతరుల వద్ద అప్పుచేసి రూ.26 లక్షలు ఇచ్చింది. అయితే ఆ డబ్బు స్వామి తిరిగి ఇవ్వక పోవడంతొ లావణ్య తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో ఈనెల 4న పుట్టింటికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని అడిగినా వారు స్పందించలేదు. దీంతో లావణ్య మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి భర్త ప్రపాద్ డ్యూటీ నుంచి ఇంటికి తాళంవేసి ఉంది. లోపలకు వెళ్లి చూడగా ఓ లేఖ లభించింది. తమ్ముడికి ఇచ్చిన రూ.26 లక్షలు తిరిగి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందుతున్నా.. అని రాసిఉంది. దీంతో భర్త ప్రసాద్ సోమవారం మేడిపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అదృశ్యం శ్రీనగర్కాలనీ: యువతి అదృశ్యమైన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్.రమ్య(20) మధురానగర్ లక్కీ లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ఈనెల 3న ఫ్రెండ్ను కలవడానికి వెళ్తున్నానని సోదరుడు నవీన్కు ఫోన్ చేసింది. యువతి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో పాటు హాస్టల్కు కూడా తిరిగి రాకపోవడంతో నవీన్ మధురానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో గ్యాస్ డెలివరీ బాయ్.. వ్యక్తిఅదృశ్యమైన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బ్రహ్మశంకర్నగర్కు చెందిన మహేశ్(38) గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. మార్చి 28న మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య బ్రహ్మణితో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులతో పాటు పలు ప్రదేశాల్లో వెతికనా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం మధురానగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు -
పోలీసుల ముందే భార్య హత్య.. జహీరాబాద్లో దారుణం!
సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్కు చెందిన కవిత (29) అనే మహిళ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం ఆమె ప్రాణం తీసింది.పోలీసుల వివరాల ప్రకారం.. మార్చి 27న కవిత తన ప్రియుడు పవన్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో ఆమె భర్త సిద్ధారెడ్డి మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, కవిత జడ్చర్లలో పవన్ తో ఉన్నట్లు గుర్తించారు.దీంతో కవితను తిరిగి జహీరాబాద్కు తీసుకురావడానికి పోలీసులు, భర్త సిద్ధారెడ్డి కలిసి జడ్చర్లకు వెళ్లారు. కవితను తీసుకువస్తున్న సమయంలో, సిద్ధారెడ్డి మార్గమధ్యంలో ఓ కత్తి కొనుగోలు చేశాడు. అనంతరం సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకున్నప్పుడు, పోలీసులు ఉన్నప్పటికీ ఆవేశంతో కత్తితో కవిత గొంతులో పొడిచి అక్కడికక్కడే హత్య చేశాడు. హత్య అనంతరం కవిత మృతదేహాన్ని పోలీసులు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు సిద్ధారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. -
Madhapur: మైండ్స్పేస్ వద్ద ఘోరప్రమాదం
హైదరాబాద్: మాదాపూర్ మైండ్స్పేస్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచి్చన ఓ డీసీఎం డ్రైవర్ స్కూటీపై వెళుతున్న దంపతులను ఢీకొట్టాడు. అనంతరం స్కూటీని జూబ్లీహిల్స్ (దాదాపు ఐదు కిలోమీటర్లు) వరకు డీసీఎం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త గాయపడ్డాడు. శనివారం అర్థరాత్రి రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మహేశ్వరంలో నివాసముంటున్న అబ్దుల్ బాసిత్ (26), అతని భార్య హనియా అయేషా (22)లు కూకట్పల్లిలో సినిమా చూసి శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మాదాపూర్ మైండ్స్పేస్ వద్ద ఓ డీసీఎం అతివేగంగా వచ్చి వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో అయేషా తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. భర్త అబ్దుల్ బాసిత్కుగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం కింద ద్విచక్రవాహనం ఇరుక్కుపోయిన విషయాన్ని డ్రైవరు గమనించకుండా 5 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. కొందరు గిగ్ వర్కర్లు గమనించి డీసీఎంను ఆపడంతో డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ సహాయకుడు పట్టుబడటంతో అతనికి దేహశుద్ధి చేశారు. చూస్తే డ్రైవర్ అసలు స్పృహలో ఉన్నాడా, లేడా అని అనుమానం వ్యక్తం చేశారు. జూబ్లిహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో డీసీఎం, ద్విచక్రవాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. -
‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ డ్రగ్స్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్లో ఉన్న ‘క్వేక్ అరేనా పబ్’లో గురువారం రాత్రి జరిగిన ‘బ్లాక్ కాఫీ’ఈవెంట్లో పాల్గొన్న 64 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మంది డ్రగ్స్ వాడినట్లు పాజివిట్ వచ్చింది. ఇది జరిగిన రెండు రోజులకే శనివారం రాత్రి గోల్కొండ సమీపంలోని తారామతి బారాదారి వంతు వచ్చింది. ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’పేరుతో నిర్వహించిన ఈవెంట్పై ఈగల్, హెచ్–న్యూ బృందాలు సంయుక్తంగా దాడి చేశాయి. ఇక్కడ 35 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఈవెంట్ నిర్వాహకుడైన అంతర్జాతీయ డీజే, భార్యభర్తలు, మోడల్ ఉండడం గమనార్హం. దీని నిర్వాహ కుల్లో ప్రముఖ అంతర్జాతీయ డీజే జాసన్ డైలాన్ కూడా ఉన్నారు. ఈ ఖరీదైన పార్టీకి సంబంధించి వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి నలుగురి నుంచి పది మంది వరకు గ్రూపులుగానూ హాజరుకావచ్చంటూ రూ.1.25లక్షల నుంచి రూ.50 వేల వరకు రేటు నిర్దేశించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఈవెంట్ ప్రారంభమైంది. దీనిపై సమాచారం అందుకున్న ఈగల్ అధికారులు నిర్వాహకులతో పాటు అతిథుల వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈవెంట్ నిర్వాహకుల్లో కీలకంగా ఉన్న అంతర్జాతీయ డీజే జాసన్కు డ్రగ్స్ వినియోగించిన చరిత్ర ఉండడంతో అప్రమత్తమయ్యారు. హెచ్–న్యూ పోలీసులతో కలిసి ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’పై ఆకస్మిక దాడి చేశాయి.ఈవెంట్కు హాజరైన వారి సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, అధ్యయనం చేసిన బృందాలు అనుమానితులుగా ఉన్న 35 మందిని గుర్తించాయి. వీరి నుంచి లాలాజలం, మూత్రం నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీళ్లు గంజాయితో పాటు కొకైన్ వాడినట్లు నిర్ధారించి హైదరాబాద్ నార్కోటిక్స్ ఠాణాలో కేసు నమోదు చేశారు. పాజిటివ్ వచ్చిన వారిలో అంతర్జాతీయ డీజే జాసన్, మోడలింగ్తో పాటు యాక్టింగ్ చేసే సర్వర్, ట్రేడింగ్ వ్యాపారి నిహార్, ఈయన భార్య ఆషి, వ్యాపారి యోగేశ్వర్, ఫార్మా కంపెనీలో ఎనలిస్ట్ అభినాష్ ఉన్నారు. వీరిపై నమోదు చేసిన కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్లోని సెక్షన్ల కింద ఆరోపణలు జోడించారు. నిందితులకు తల్లిదండ్రులు, సంబం«దీకుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు నోటీసులు జారీ చేసి విడిచిపెట్టారు. ఈ డ్రగ్ ఎక్కడ నుంచి ఖరీదు చేశారనే అంశంపై లోతుగా ఆరా తీస్తున్నారు. -
మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి
సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని రెండు పడకల గృహ సముదాయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై బాలిక తల్లి నిర్మల తన రెండవ భర్త అశోక్పై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాలిక ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, బాలిక ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. -
Hyd: దారుణం.. మహిళను, స్కూటీని ఈడ్చుకెళ్లిన ట్రక్
హైదరాబాద్: నగరంలో మాదాపూర్లో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ డీసీఎ వ్యాన్ బీభత్సం సృష్టించింది,. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న దంపతుల్లో భార్య చనిపోగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మూవీ చూసి స్కూటీపై వెళ్తున్న దంపతుల్ని డీసీఎం ఢీకొట్టింది. ఆ దంపతుల్లో భార్య కూడా స్కూటీతో వ్యాన్లో చిక్కుకుపోయింది. అనంతరం ఆ స్కూటీని అలాగే కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వ్యాన్ పక్క నుంచి వెళ్తున్న నగర వాసులు ఈ విషయాన్ని గమనించి ఆ డీసీఎం వ్యాన్ను అడ్డగించారు. అనంతరం లారీ డ్రైవర్, క్లీనర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. హనియ్యా ఆయేషా (22), అబ్దుల్ బాసిత్(26)లు భార్యభర్తలు. వీరిది కేరళ రాష్ట్రం. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు. జ్యూయలరీ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నిన్న రాత్రి మూవీ చూడటానికి వెళ్లారు. అయితే వీరిని తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం ఢీకొట్టడంతో వారిలో భర్త రోడ్డు పక్కకు పడిపోగా, భార్య మాత్రం డీసీఎం వ్యాన్లో చిక్కుకుపోయింది. ఇలా కిలో మీటర్లు వెళ్లిన తర్వాత ఇది గమనించిన కొంతమంది వ్యాన్ అడ్డగించి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా, తీవ్రగాయాలైన భర్తకు చికిత్స అందిస్తున్నారు. అయితే వారిని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్కు ప్రమాదం జరిగిన విషయం తెలిసినా ఆపకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ స్కూటీ ఆ వ్యాన్ కింద చిక్కుకున్నా అలానే వెళ్లిపోయాడు. ఇలా కిలో మీటర్లు దాటి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఒక చోట గమనించిన కొంతమంది ఆ వ్యాన్ను అడ్డగించి డ్రైవర్ను పట్టుకున్నారు. ఆ మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ను, క్లీనర్నుపోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఆ వ్యాన్ను పోలీసులు సీజ్ చేశారు. -
పాఠశాల నుంచి వస్తూ.. అనంత లోకాలకు
హైదరాబాద్ : తండ్రితో బైక్పై వస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని స్కూల్ బ్యాగ్ ఆర్టీసీ బస్సుకు తట్టుకోవడంతో కిందపడి ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. తన కళ్లెదుటే కూతురు మృత్యువాత పడటంతో ఆ కన్నతండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, రోడ్డుపై నీరు పేరుకుపోవడం.. పక్కనే కారు పార్క్ చేయడంతో.. బైక్ను తప్పించబోవడంతో ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఊదురు గ్రామానికి చెందిన కంచి ప్రసాద్, సునీత దంపతులు రెండేళ్ల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–58లోని ప్లాట్నెంబర్ 1143లో వాచ్మెన్లుగా పని చేస్తున్నారు. వీరి కూతురు కీర్తిక (14) వెంగళరావునగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి, కుమారుడు సాయి (11) ఆరో తరగతి చదువుతున్నారు. రోజూ మాదిరిగానే ప్రసాద్ శనివారం కూతురు, కొడుకును మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి బైక్పై తీసుకువస్తున్నాడు. బైక్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1556 వద్దకు రాగానే గుంతలు తేలిన రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో పక్కకు వెళ్లాడు. అక్కడ కారు పార్క్ చేసి ఉన్న కారును తప్పించేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో వెనుక నుంచి మితిమీరిన వేగంతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దూసుకొచి్చంది. బస్సుకు కీర్తిక స్కూల్ బ్యాగ్ తట్టుకోవడంతో ఆమె కిందపడింది. టైరు బాలిక తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రసాద్కు, సాయికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ తిరుపతిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–5లోని మెట్రో స్టేషన్ రోడ్డంతా గుంతలమయమై మురుగునీరు పారుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుంతలు పూడ్చకపోవడం, మురుగు సమస్యకు చెక్ పెట్టకపోవడంతో శనివారం రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృత్యువాత పడింది. దీనికి తోడు రోడ్డు పక్కన అక్రమంగా పార్కింగ్ చేసిన కారు కూడా ఈ ఘటనకు కారణమైందని, జీహెచ్ఎంసీ అధికారులపైనా కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నవ వధువు ఆత్మహత్య.. ఏం జరిగింది?
సాక్షి, మాక్లూర్: పెళ్లి అయిన నెలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.బాన్సువాడకు చెందిన అఖిల (25)కు ఆలూర్ మండలం కల్లేడ గ్రామానికి చెందిన శ్రీకాంత్తో మార్చి 5న వివా హం జరిగింది. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన ఆమె, శుక్రవారం రాత్రి అత్తారింటికి చేరుకుంది. శనివారం ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అఖిల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కాగా, పెళ్లైన నెల రోజులకే అఖిల బలవన్మరణానికి పాల్పడటం కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు -
కట్టుకున్నవారే కాలయముళ్లు
అడ్డాకుల/పటాన్చెరు టౌన్: రక్షణ గా ఉండాల్సిన భర్తలే భార్యల పాలిట కాలయముళ్లు అయ్యారు. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఈ సంఘ టనలు కలకలం రేపాయి. ఒకచోట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే మనస్పర్థలతో భార్య ప్రా ణం తీస్తే.. మరోచోట అనుమానంతో పెళ్లయిన ఏళ్ల తర్వా త భార్యను కిరాతకంగా గొంతు కోసి చంపాడొక భర్త. వివరా లివి. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన నర్సు కె.శ్రీదేవి (21).. అదే గ్రామా ని కి చెందిన చందుతో ప్రేమలో పడింది. కులాలు వేరైనా ఎని మిది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి గ్రామంలో చందు ఇంట్లోనే ఉంటూ కాపు రం చేస్తున్నారు. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగాయి. చందు నిత్యం తన భార్యను హింసించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి భార్యను కొట్టి గొంతు నులిమి చంపాడు. పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కుందనేలా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరికి గ్రామస్తు ల సమాచారంతో ఎస్ఐ ఎం.వేణు పొలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి భర్త చందును అదుపులోకి తీసుకుని విచారించారు. యువతి మృతదేహానికి జిల్లా ఆస్ప త్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. చందు అక్కడికి వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతురాలి బంధువులు పట్టుబట్టారు. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అడ్డాకుల, దేవరకద్ర ఎస్ఐలు శ్రీనివాస్, నాగన్న బందోబస్తు చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చందుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. అనుమానమే పెనుభూతమై..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీ మ జిల్లా, అల్లవరం మండలం మొగలమూరుకు చెందిన పరమేశ్వరరావు, లీలా వతి (54) దంపతులు పటా న్చెరు ఏపీఆర్ కాలనీలో కుమారుడు మహావీర్ ఆరు ద్ర, కోడలు సుజాతతో కలి సి ఉంటున్నారు. కాగా కొంతకాలంగా పరమేశ్వరరావు, లీలావతి పై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతు న్నాడు. శనివారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కుమారుడు, కోడలు తమ కుమారునికి వ్యాక్సిన్ వేయించేందుకు ఉదయం 10 గంటల సమయంలో బయటికి వెళ్లారు. ఈ క్రమంలో పరమేశ్వరరావు కూరగా యలు కోసే కత్తితో లీలావతి గొంతుకోసి పరారయ్యాడు. కుమారుడు, కోడలు వచ్చి చూసేసరికి లీలావతి రక్తపు మడు గులో చనిపోయి ఉండటంతో అరుస్తూ బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న సీఐ రాజు సిబ్బందితో కలిసి ఘట నా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. పరారైన పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కుటుంబ కలహాలతో సర్పంచ్ ఆత్మహత్య
కడెం: కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో జరిగింది. ఎస్సై సాయికిరణ్ కథనం ప్రకారం.. మండలంలోని నర్సాపూర్కు చెందిన లహరిక (31), మాసా యిపేటకు చెందిన ఆర్ఎంపీ రాజేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంతలో గతేడాది డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. మహిళా రిజర్వేషన్ కావడంతో రాజేశ్ లహరికను సర్పంచ్గా నిలబెట్టగా విజయం సాధించింది. అయితే వారి ఇంట్లో గొడవలు మాత్రం సద్దుమణ గలేదు.దీంతో లహరిక ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఇంతలో ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సభలు నిర్వ హించాలని నిర్ణయించింది. దీంతో రాజేశ్ నర్సా పూర్కు వెళ్లి లహరికను ఈనెల 1న తీసుకు వచ్చా డు. గురువారం గ్రామ సభలో సర్పంచ్ లహరిక పాల్గొన్నారు. అయితే శుక్రవారం ఉద యం తన ఏడేళ్ల కొడుకు ప్రజ్వల్ను తీసుకుని గ్రామ సమీపంలోని తోట వద్దకు వెళ్లి పురుగుల మందుతాగింది. అనంతరం ఇంటికి చేరు కున్నారు. ఇంతలో ప్రజ్వల్ తన తండ్రికి ఫోన్చేసి విషయం చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన రాజేశ్ లహరికను ఖానాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. -
పెళ్లికి పెద్దలు నిరాకరించారని..
చేర్యాల(సిద్దిపేట): పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అది తట్టుకోలేక ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ముస్త్యాల గ్రామానికి చెందిన తరిగొప్పుల హారిక (24), అదే గ్రామానికి చెందిన అనుముల రాకేశ్ (27) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో గత నెల 28న రాకేశ్గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ప్రేమికుడు మృతి చెందినప్పటి నుంచి మనోవేదనకు గురైన హారికను కుటుంబ సభ్యులు జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. -
5 ఏళ్ల ప్రేమ, పెళ్లైన నెలకే ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కట్నం కోరలకు మరో యువతి బలైపోయింది. హైదరాబాద్లోని సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ ప్రాంతంలో, ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త వేధించాడన్న ఆరోపణలతో, బిహార్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇషితా యాదవ్ తనువు చాలించింది. పోలీసుల వివరాల ప్రకారం,బుధవారం సాయంత్రం, ఇషితా యాదవ్ తన అపార్ట్మెంట్లోని హాలులో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను ఆ స్థితిలో చూసిన ఆమె భర్త, నీరజ్ భన్సల్, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇషితా ,నీరజ్ 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. ఇషితా స్వస్థలం బిహార్ కాగా, నీరజ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాట్నాలో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం, వీరిద్దరూ హైదరాబాద్కు మకాం మార్చారు.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం, నీరజ్ అదనపు కట్నం కోసం ఇషితాను వేధించడం, ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో పాటు, తాను ఇటీవల ప్రారంభించిన ఒక స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఆమె కుటుంబాన్ని డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఇషితా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్ -
కుళ్లిపోయిన వెయ్యి కిలోల మాంసం సీజ్
హైదరాబాద్: కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయ గోడౌన్పై పోలీసులు దాడులు చేశారు. సుమారు వెయ్యి కిలోల మాంసం విడిభాగాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటన మంగళ్హాట్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్హాట్ కిస్తీ చమాన్ ప్రాంతంలో అఫ్రోజ్ అనే వ్యక్తి ఎ టు జెడ్ గోదాం నిర్వహిస్తున్నాడు. నగరంలోని పలు హోటళ్లకు, రెస్టారెంట్లకు, ఫంక్షన్ హాళ్లలో జరిగే శుభ కార్యాలకు మాంసాన్ని సరఫరా చేస్తున్నాడు. మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల నుంచి అఫ్రోజ్ నాణ్యత లేని మాంసాన్ని విడిభాగాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాడు. బుధవారం మంగళ్హాట్ పోలీసులతో పాటు టాస్్కఫోర్స్ హెచ్ ఫాస్ట్ బృందం, వెటర్నరి అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ గోడౌన్లో కుళ్లిపోయిన, అపరిశుభ్రమైన, దుర్వాసనతో కూడిన దాదాపు వెయ్యి కిలోల మేకలు, గొర్రెల మాంసం విడిభాగాలను స్వా«దీనం చేసుకుని నిందితుడు అఫ్రోజ్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 రోజుల క్రితం ఇదే గోడౌన్పై దాడులు చేసి కుళ్లిన మాంసాన్ని, విడిభాగాలను స్వా«దీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. తిరిగి కుళ్లి పోయిన మాంసంతో విక్రయాలు చేస్తుండడంతో పోలీసులు మరోసారి దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. పట్టుకున్నారు.. గోప్యంగా ఉంచారు.. ఉప్పల్: గడువు ముగిసిన పదార్థాలతో తిను బండారాలను తయారు చేస్తున్న పలు సంస్థలపై హెచ్–ఫాస్ట్ అధికారులు బుధవారం దాడులు చేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. రామంతాపూర్ బాలకృష్ణానగర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి గడువు ముగిసిన పదార్థాలతో తిను బండారాలను తయారు చేసి వాటిపై శ్రీనివాస్ స్వగృహ ఫుడ్స్ పేరిట లేబుల్స్ అతికించిన ప్యాకెట్లను రిటేల్ షాపుల్లో విక్రయిస్తున్నాడు. ఫుడ్ సేప్టీ అధికారులు గత నెల 30న దాడి చేసి 20 బ్యాగుల మైదా, 20 టిన్నుల ఆయిల్ను స్వా«దీనం చేసుకున్నారు. రామంతాపూర్ సాయికృష్ణానగర్లో నాయుడు ఫుడ్స్ కంపెనీ పేరిట నిర్వహిస్తున్న తిను బండారాల సంస్థపైనా దాడి చేసిన అధికారులు.. షేక్ మహబూబ్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం. -
నెలకు 10 శాతం వడ్డీ.. నాగోల్లో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: తమ వద్ద పెట్టుబడి పెడితే భారీ వడ్డీ ఇస్తామని ఆశచూపి రూ.15 కోట్లకు టోకరా వేసిన నిందితుడిని పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నాగోలు ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన కిచ్చ వీరభద్రరావు (51) బండ్లగూడ ఆనంద్ నగర్లో గల రాజీవ్ స్వగృహలో నివాసముంటున్నాడు. భార్య రాజ్యలక్ష్మి, సహాయకుడు వెంకట దుర్గాప్రసాద్తో కలిసి నాగోల్ వీరభద్ర ట్రేడింగ్ పేరుతో కార్యాలయం ప్రారంభించారు.తమ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున వడ్డీ చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో సుమారు 290 మంది వినియోగదారులు రూ.30 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రారంభంలో కొంతమందికి వడ్డీ చెల్లిస్తూ నమ్మకం కల్పించిన నిందితులు 2025 మే నెలలో గుర్గాంలో వీరభద్రరావుపై సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.అనంతరం రూ.30 కోట్లలో రూ.15 కోట్లు చెల్లించి, మిగతా రూ.15 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు. అధిక వడ్డీ ఆశ చూపి 290 మందికి టోకరా వేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా వీరభద్రరావు, రాజ్యలక్షి్మ, వెంకట దుర్గాప్రసాద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
హనుమకొండలో ఘోరం.. స్విమ్మింగ్పూల్లో పడి..
హనుమకొండ జిల్లా: అనుమానాస్పద స్థితిలో స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందిన ఘటన మండలంలోని పున్నేలు క్రాస్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్ – ఫర్హత్(26) దంపతులకు ఇద్దరు కుమారైలు ఉమేరా(8), అయేషా(6) ఉన్నారు. వీరి కుటుంబానికి ఓ వెంచర్లో స్విమ్మింగ్ పూల్ ఉండగా.. దానిని నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. తరచూ వెళ్లే మాదిరిగానే బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా స్విమ్మింగ్ పూల్కు వెళ్లినట్లు తెలిసింది. ఈక్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లి స్విమ్మింగ్ పూల్లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు మృతదేహాలను బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తల్లి, కూతుళ్ల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తు మృతిచెందినట్లుగా భర్త అజారుద్దీన్ చెబుతున్నాడు. ఇటీవల అయేషా మూడోసారి గర్భం దాల్చడం విషయంలో దంపతులకు గొడవలు జరుగుతున్నాయని, అనుమానాస్పద స్థితిలో మృతి చెందలేదని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి అలీ అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేసినట్లు ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు. -
HYD: ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులను హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో తల్లి స్రవంతి ముందుగా ఇద్దరు కుమారులు కార్తిక్,కౌశిక్లను హత్య చేసింది. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, భార్య స్రవంతిని వదిలేసి భర్త ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అత్తమామలు స్రవంతికి కొంత స్థలాన్ని రాసిచ్చారు. అయితే, ఆ స్థలాన్ని తిరిగి ఇవ్వాలని భార్యను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఇదే కారణంగా భార్య, పిల్లలను భర్త ప్రవీణ్ హత్య చేసి ఉండవచ్చని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఒంటరి మహిళలే అతని టార్గెట్
హైదరాబాద్: బెట్టింగ్ కు బానిసై.. ఒంటరి మహిళలను మభ్యపెట్టి కారులో తీసుకువెళ్లి హత్యలు చేస్తున్న సీరియల్ సైకో కిల్లర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా చనగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు (29) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్గా ఉన్నాడు. కొంతకాలంగా బెట్టింగ్లకు బానిసయ్యాడు. ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. ఫిలింనగర్ రోడ్ నెంబర్–16లో నివసించే బోయినపల్లి యాదమ్మ (70)ని పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న తన కారులో ఆమెను ఎక్కించుకున్నాడు. నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు తీసుకువెళ్లి ఆమెను కిందికి దింపి తాడుతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ నగలు అమ్మిన డబ్బును మళ్లీ బెట్టింగ్లో పెట్టాడు. డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్లో రోజూ బట్టలు ఉతికి ఇస్త్రే చేసే మంగతాయారమ్మ (60)ని టార్గెట్ చేశాడు. ఈ నెల 17న ఆమె పని ముగించుకుని బయటకు రాగానే జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–46లోని మస్తాన్నగర్లో దింపుతానని తన కారులో ఎక్కించుకున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. మోకిల పోలీస్స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని పడేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు, అదే రోజు తీసుకున్న జీతం రూ.16 వేలు తీసుకుని ఉడాయించాడు. మిస్సింగ్ కేసులు నమోదు మిస్సింగ్ కేసులు నమోదు చేసిన అనంతరం యాదమ్మ మృతదేహం కుళ్లిపోయి కనిపించగా నార్సింగ్ పోలీసులు జీహెచ్ఎంసీకి అప్పగించారు. అయితే మిస్సింగ్ కేసులను సీసీటీఎన్ఎస్లో పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్లో లభ్యమైన మృతదేహం ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు ఒక్కటేనని తేలింది. దీంతో అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసు నడిపిస్తున్న కారును గుర్తించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు విచారించగా బెట్టింగ్ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లుగా అంగీకరించాడు. ఒకవేళ పట్టుపడకపోతే తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని కూడా ఇలాగే తీసుకువెళ్లి హత్యకు పథకం వేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. -
విద్యార్థినిపై కీచక టీచర్ దారుణం.. ఘటనలో ఏడుగురు అరెస్ట్
నారాయణపేట: మద్దూరు మండలంలోని మోమినాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘటనలో ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేసి.. రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ డా.వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ వివరాల మేరకు.. ప్రధాన నిందితుడు పెద్దూరుపాడుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చండేపల్లి స్వామి ఓవిద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. మరో టీచర్ గుర్నాథ్రెడ్డి ఆ వీడియోను ఉపాధ్యాయుడు కర్ని చెన్నకేశవులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో గుర్నాథ్రెడ్డి సదరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయించారు.ఈ విషయంపై గ్రామానికి చెందిన గుల్ల రవికుమార్, బి.ఆనంద్, నిడ్జింత విజయ్కుమార్, మేకల రవి సదరు వీడియోను అనధికారికంగా పంచుకోవడంతో పాటు అదే గ్రామంలో రాజీ ప్రయత్నాలు వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ కేసును డీఎస్పీ నల్లపు లింగయ్య విచారించగా.. విద్యారి్థనిపై ప్రధాన నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అతడితో పాటు అతడికి సహకరించిన వ్యక్తులపై పోక్సో, ఐటీ, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి.. సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.ఏడుగురు నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. జిల్లాలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నామని.. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమస్యలను చట్టపరంగా పరిష్కరించకుండా స్వయంగా రాజీ ప్రయత్నాలు చేయడం.. లేదా నేరాలను దాచిపెట్టడం వంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైన నేరాలుగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. -
నీట మునిగి 8 మంది మృతి
కొండపాక (గజ్వేల్): రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో నీట మునిగి 8 మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు ఈతకు వెళ్లి మరణించగా, మరో ఇద్దరు చెరువులో మునిగి చనిపోయారు. గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు (వరుసకు అక్కా తమ్ముడు) రిషిక (13), కుక్కల మనీష్ అలియాస్ లక్కీ (11) మామ వరుసైన గణేశ్తో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. గణేశ్ పశువులను మేతకు తీసుకెళ్లగా మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువలో మనీష్ ఈత కోసం దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండగా రిషిక కాపాడేందుకు కాలువలోకి దిగగా ఇద్దరూ మృతి చెందారు. రుషిక కొడకండ్ల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, మనీష్ 7వ తరగతి చదువుతున్నాడు. కుటుంబీకులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్హెచ్ఓ, ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. ఇదిలాఉండగా హైదరాబాద్లోని మల్కాజ్గిరి బాలాజినగర్కు చెందిన రాములు కుకునూరుపల్లి మండలంలోని ముద్దాపూర్, రాంచంద్రాపూర్ శివారులో కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీంతో రాములు కొడుకు రాజుతోపాటు 8 మంది స్నేహితులతో కలిసి సరదా కోసం వ్యవసాయ బావి వద్దకు వచ్చారు. విజయ్కుమార్తోపాటు మరో నలుగురు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువలో ఈత కోసం దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతోపాటు ఈత రాకపోవడంతో విజయ్కుమార్ నీటిలో మునిగిపోతుండగా స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు.. అయినా ఫలించలేదు. దీంతో విజయ్కుమార్ మృతి చెందాడు. విజయ్ కుమార్ ఆర్మీ క్యాంటీన్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబీకుల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో విషాదంసత్తుపల్లి టౌన్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్న వేంసూరు మండలం కుంచపర్తికి చెందిన ఒంగూరి జానకి, వెంకటేశ్వరరావు కుమారుడు నాగబాబు (12) రేజర్ల సమీపాన మామిడి తోటలో గేదెలు మేపేందుకు వెళ్లాడు. నాగబాబుతోపాటు అదే కాలనీకి చెందిన వంటిపులి దేవ (11), షేక్ సైదులు కూడా వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే నీళ్లు ఉన్న మట్టి క్వారీ గుంత వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు దూకారు. అయితే క్వారీ గుంతలో నీళ్ల లోతును అంచనా వేయలేక మునిగిపోతూ కేకలు వేశారు. సమీపంలో గేదెలు మేపుతున్న దేశినేని సుధారాణి తన చున్నీ విసిరి భుజాల వరకు నీట మునిగిన షేక్ సైదులును కాపాడింది. మిగతా ఇద్దరు నీళ్లల్లో పూర్తిగా మునిగిపోవడంతో మరణించారు. చెరువులో మునిగి ఇద్దరు మృతికోనరావుపేట (వేములవాడ): చెరువులో మునిగి ఇద్దరు చనిపోయిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం నింపింది. ధర్మారం గ్రామానికి చెందిన ముడికె లక్ష్మీరాజం (65), కుమ్మం మొండయ్య (55) అనే గొర్రె కాపరులు తమ జీవాలను తీసుకుని గ్రామ శివారులోని పెద్దచెరువు వైపు వెళ్లారు. గొర్లను చెరువులోకి తీసుకెళ్లి స్నానం చేయించేందుకు దిగగా లక్ష్మీరాజం ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డాడు. గమనించిన మొండయ్య అతడిని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. ఈక్రమంలో లక్ష్మీరాజం.. మొండయ్య మెడను గట్టిగా పట్టుకోవడంతో ఈత వచ్చినా కూడా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కుంటలో మునిగి...అబ్దుల్లాపూర్మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో నివసిస్తున్న నాగనా థ్ పంచాల్ కుమారుడు నరేష్ నాగనాథ్ (14) కోహెడ జెడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన నరేష్ ఈత కొట్టేందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేక పోయింది. ఆదివారం ఉదయం సంఘీనగర్ నుంచి గండిచెరువుకు వెళ్లే దారిలో ఉన్న సమల గడ్డ కుంట వద్ద నరేష్ దుస్తులు, చెప్పులు కనిపించడంతో కుంటలో పరిశీలించగా మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కూతురు పెళ్లికి అప్పు పుట్టక..
పాపన్నపేట (మెదక్): కూతురు పెళ్లి కోసం అప్పు పుట్టక ఓ తండ్రి మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... నార్సింగి గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొన సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. వారం క్రితం ఆయన పెద్ద కూతురు నిశ్చితార్థం జరిగింది. ఆదివారం ఇంట్లో పెళ్లి పత్రిక పెట్టుకొని, సాయంత్రం పెద్దల పండుగ చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు చుట్టాలకు కబురందించారు. అయితే త్వరలో బిడ్డ పెళ్లి చేయాల్సి ఉండగా, డబ్బులు లేక, అప్పులు పుట్టక ఆందోళన చెందాడు. దిక్కుతోచని స్థితిలో శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు గ్రామ శివారులో వెతికారు. కాగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని మూతబడిన రైస్ మిల్లులో ఉరివేసుకున్నాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. పెళ్లి పత్రిక కోసం రావాల్సిన బంధువులు, అంత్య క్రి యలకు రావాల్సి రావడంతో, ఊరంతా శోక సంద్రమైంది. కాగా, పెళ్లి కుమారుని తరపు వారు కట్నం ఆశించకుండానే పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలిసింది. విషయం తెలిసి వారు కూడా కన్నీరు మున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


