సాక్షి, బెంగళూరు : ఎన్నికల్లో గెలవడానికి ముందూ వెనకా ఆలోచించకుండా అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆటు తరువాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైనట్లుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా పీయూసీ (ఇంటర్) విద్యార్థులకు ల్యాప్టాప్ చేతికి అందలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా నిధులు లేవనే నెపంతో గతంలో ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలకు మంగళం పాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో పీయూసీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ అందజేస్తామని పేర్కొంది. ఇదే విషయాన్ని ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసి ప్రసంగంలో (2014 జనవరి 22)లో కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలోని సుమారు 10 లక్ష మంది పీయూసీ విద్యార్థులు ఉన్నారు.
వీరందరికి ల్యాప్టాప్లు అందించడానికి రూ1,000 కోట్లు అవసరం అవుతాయి. ఈ ఏడాది విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్ (రూ 21,305 కోట్లు)లో ఇది కేవలం 4.6 శాతం మాత్రమే. అయితే నిధుల కొరతను సాకుగా చూపుతూ ఉచిత ల్యాప్టాప్ల పథకానికి స్వస్తిపలికినట్లు తెలుస్తోంది.
కనీసం మెరిట్ స్టూడెంట్స్ (80 శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్నవారికి) ల్యాప్టాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో అధికారులు నివేదిక తయారు చేసి ఇందుకు రూ.300 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతులెత్తేసిన ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యార్థినులకు అందిస్తున్న ఉచిత సైకిళ్ల వితరణ కూడా నిలిపి వేయనున్నట్లు తెలుస్తోంది. 2012-13 ఏడాదికి అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ చివరిసారిగా విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేసింది.
అటు పై 2013-14 ఏడాదికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సైకిల్ కూడా కొనుగోలు చేయకం పోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాజీవ్ విద్యా మిషన్ నుంచి నిధులు వస్తాయనే ఉద్దేశంతో ఆరు నుంచి పదోతరగతి విద్యార్థినులకు ఉచితంగా ఏడాదికి 100 శానిటరి నాప్కిన్లు ఇవ్వనున్నట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. ఇందుకు మంత్రిమండలి కూడా ఆమోదముద్ర వేసింది.
అయితే కేంద్రం నుంచి అవసరమైన నిధులు ఇప్పటికీ అందలేదు. దీంతో నాప్కిన్ల వితరణ పథకం అమలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అనుకున్నంత మేర పన్నులు వసూలు కావడం లేదు.
దీంతో ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే నిధులు చాలడం లేదు. అంతేకాకుండా ప్రస్తుత లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు దాదాపు అసాధ్యమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అందువల్లే మానిఫెస్టోలో పేర్కొన్న పలు సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి అటకెక్కించే ఆలోచనలో ఉన్నారు.’ అని పేర్కొన్నారు.
సంక్షేమానికి మంగళం
Published Sun, Apr 27 2014 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement