తెలంగాణ జేఏసీ ఆదివారం సమావేశమైంది
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఆదివారం సమావేశమైంది. రాష్ట్రంలో రైతు సమస్యలు, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, భూ నిర్వాసితుల సమస్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన జేఏసీ సభ్యులు.. అసెంబ్లీ జరగుతున్న సమయంలోనే సమస్యలపై భారీ నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.