నోట్ల మార్పిడి ముఠా అరెస్టు | rs. 4 lakh new currency caught in nalgonda district | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

Dec 17 2016 1:01 PM | Updated on Aug 29 2018 4:18 PM

పాతనోట్లకు కమీషన్‌పై కొత్తనోట్లను ఇచ్చే ముఠాను యాదాద్రి భువనగరి జిల్లా వలిగొండ పోలీసులు పట్టుకున్నారు.

వలిగొండ: పాతనోట్లకు కమీషన్‌పై కొత్తనోట్లను ఇచ్చే ముఠాను యాదాద్రి భువనగరి జిల్లా వలిగొండ పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీనగర్‌కు చెందిన ఐదుగురు, వలిగొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం ఉదయం స్థానిక అరూర్ రోడ్డులో నోట్ల మార్పిడికి యత్నిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు వారిని పట్టుకుని విచారిస్తున్నారు. వారి నుంచి రూ.4 లక్షల విలువైన కొత్తనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement