గ్రామ దేవత ఆదేశం.. ఊరు మొత్తం ఖాళీ | Residents Vacate Village on Deitys Instructions in Karnataka | Sakshi
Sakshi News home page

గ్రామ దేవత ఆదేశం.. ఊరు మొత్తం ఖాళీ

Apr 13 2020 8:11 AM | Updated on Apr 13 2020 8:12 AM

Residents Vacate Village on Deitys Instructions in Karnataka - Sakshi

గ్రామంలో ఉన్న పెద్దలు, వృద్ధులు, చిన్నారులు, కోళ్లు, మేకలు, పశువులను కూడా ఊరి బయటకు తరలించారు.

బెంగళూరు : గ్రామ దేవత మారమ్మ దేవి అదేశించిందని గ్రామం మొత్తం ఖాళీ అయిన ఘటన తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకాలోని ముద్దనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్‌ ప్రమాదం ఉందని, ఈ వైరస్‌ను అరికట్టడానికి మూడు రోజుల పాటు ఊరిలో ఎవరూ ఉండకూదని మారమ్మదేవి భవిష్యవాణి చెప్పడం జరిగిందని గ్రామస్తులు చెప్పారు. దీంతో ఊరికి వెళ్లే దారిని పూర్తిగా ముళ్ల కంచెను వేసిన గ్రామస్తులు ఊరి చివరి చిన్నపాటి డేరాలు వేసుకున్నారు. గ్రామంలో ఉన్న పెద్దలు, వృద్ధులు, చిన్నారులు, కోళ్లు, మేకలు, పశువులను కూడా ఊరి బయటకు తరలించారు. దీంతో ఊరు మొత్తం నిర్మానుష్యంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement