జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ | kethireddy jagadishwar reddy contest in tamilnadu assemblye lection | Sakshi
Sakshi News home page

జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ

May 15 2016 4:43 PM | Updated on Sep 4 2017 12:10 AM

జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ

జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై స్వతంత్ర అభ్యర్ధిగా తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నేత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పోటీ చేయనున్నారు.

సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ఆర్‌కే నగర్, హోసూరు నియోజకవర్గాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితపై స్వతంత్ర అభ్యర్ధిగా తమిళనాడు యువశక్తి  వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నేత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పోటీ చేయనున్నారు.

తెలుగు భాషతో పాటు  తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆ రెండు నియోజకవర్గాల్లో జయలలితపై పోటీ చేస్తున్నట్లు కేతిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా స్థానికంగా ఉన్న తెలుగు ఓటర్లు కులం, మతం కంటే తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తించి ఓటు అనే అస్త్రం ద్వారా తమ సత్తా చాటాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement