విజయ దశమికి సెలవు లేదా ?
కర్ణాటక, యశవంతపుర: 2020–2021 విద్యా సంవత్సరపు సెలవులను అధికారులు ప్రకటించారు. అయితే విజయదశమి పండుగకు సెలవును ప్రకటించలేదు. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థల పాలన మండలి ఒక్కూట అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. హిందువుల పవిత్రమైన పండుగకు సెలవును ప్రకటించకపోవటంతో ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. దసరా సెలవులు అక్టోబర్ 3 నుంచి 25 వరకు ఇచ్చారు. 26న విజయదశమికి పాఠశాలలను తెరవాలని విద్యా శాఖ ఆదేశించింది. 26న సెలవు ఉన్నా విద్యాశాఖ కళ్లు మూసుకుని సెలవుల జాబితా రూపొందించిందని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం మండిపడింది.