మార్కెటింగ్ శాఖల్లో ప్రమోషన్ల వివాదం
రోస్టర్ పాయింట్లు, సీనియారిటీ జాబితాలు లేవు
డిప్యూటేషన్పై వచ్చిన ఇంజినీర్లకు అందలం
మాతృసంస్థ ఉద్యోగులకు అన్యాయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ ఇంజినీరింగ్ విభాగంలో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ, రోస్టర్ పాయింట్లకు విరుద్ధంగా కొందరికి పదోన్నతులు కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 14 ఏళ్లుగా మాతృసంస్థలో సేవలు అందిస్తున్న సివిల్ ఇంజినీర్లను కాదని మూడేళ్ల క్రితం డిప్యూటేషన్పై వచ్చిన మెకానికల్ ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించేం దుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మార్కెటింగ్ శాఖలో పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ శాఖలో డొంకరోడ్ల మరమ్మతులు, గోడౌన్ల నిర్మాణాలకు సివిల్ ఇంజినీర్లు అవసరం కావడంతో సివిల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేసిన వారిని నియమించింది. వీరు కొనసాగుతుండగానే మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్ఎంఈఎల్) నుంచి బీటెక్ చేసిన 12 మంది మెకానికల్ ఇంజినీర్లు(అసిస్టెంట్ ఇంజినీర్లుగా) డిప్యూటేషన్పై వచ్చి, ఆ తరువాత మార్కెటింగ్ శాఖలో విలీనమయ్యారు. ఈ విభాగంలో ఇప్పటివరకూ సీని యారిటీ, రోస్టర్ పాయింట్ల నిర్వహణ సక్రమంగా లేదు.
డిప్యూటేషన్పై వచ్చిన వారిలో ఇద్దరు వ్యక్తులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతి పొందేందుకు మంత్రి దేవినేని ఉమాకు సన్నిహితంగా ఉంటున్న పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను ఆశ్రయించారు. దీంతో ఆ ఇద్దరికి ప్రమోషన్లు ఇవ్వాలంటూ మార్కెటింగ్ శాఖ కమిషనర్పై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. ఇక సీనియారిటీ ప్రకారం పదోన్నతి పొందాల్సిన ఇద్దరు ఇంజనీర్లు తమకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యోగ సంఘాలను ఆశ్రయించారు. తాము 14 ఏళ్లుగా మాతృసంస్థలో పనిచేస్తున్నామని, సర్వీసు రికార్డుల్లో ఎక్కడా రిమార్కులు లేవని మార్కెటింగ్శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఇచ్చిన లేఖలో తెలిపారు. సీనియారిటీ, రోస్టర్ పాయింట్లకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇస్తే ఇతర ఇంజినీరింగ్ సిబ్బందికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది
‘‘పదోన్నతుల ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మాతృసంస్థ నుంచి ఇద్దరు, డిప్యూటేషన్పై వచ్చి విలీనమైన ఇద్దరు ఇంజనీర్లు పదోన్నతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతలు. ట్రాక్ రికార్డు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక పంపాను. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’’
– మల్లికార్జునరావు, మార్కెటింగ్ శాఖ కమిషనర్
మనోడే... పదోన్నతి ఇచ్చేయ్!
Published Wed, Oct 19 2016 8:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement