- ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం
- నగర శివారులో నిర్మాణానికి కసరత్తు
సాక్షి, ముంబై: వాతావరణ వివరాలు తెలుసుకునేందుకు ముంబైలో మరో ‘వెదర్ డాప్లర్ రాడార్’ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివారు ప్రాంతంలోని ఓ కొండపై ఈ డాప్లర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వాతావరణ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణనంద హోసాల్కర్ తెలిపారు. మొదటి రాడార్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో భవనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో రెండో డాప్లర్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలకు నగరం, శివారు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఘటనలో దాదాపు రెండు మంది ప్రాణాలు పోగా కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం వాటిళ్లింది. వర్షాలు, వరదలపై ముంద స్తు హెచ్చరికలు జారీ చేయలేదని వాతావరణ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో వాతావరణ వివరాలు కచ్చితంగా తెలుసుకునేందుకు కొలాబా నేవీ నగరంలోని అర్చన భవనంపై రూ. 35 కోట్లు విలువచేసే వెదర్ డాప్లర్ రాడార్ను ఏర్పాటు చేశారు. డాప్లర్ ఏర్పాటు చేయడంవల్ల ఈ ప్రాంతంలో ఎత్తై భవనాలు నిర్మించడానికి వీలులేకుండా పోయింది. 15 టన్నుల బరువైన ఈ రాడార్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల చుట్టపక్కల ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. దీంతో బిల్డర్ లాబీలు 2014లో హైకోర్టును ఆశ్రయించాయి.
రాడార్ను మరోచోటికి మార్చాలని ప్రభుత్వం, బీఎంసీ, వాతావరణ శాఖను కోర్టు ఆదేశించింది. రాడార్ను శివారు ప్రాంతానికి తరలించడానికి బిల్డర్ లాబీలు అనేక ప్రయత్నాలు చేశాయి. అందుకు అవసరమైన సాయం చేసేందుకు కూడా సిద్ధపడ్డాయి. కానీ రాడార్ను చే యడం సాధ్యం కాదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో రెండో రాడార్ ఏర్పాటుకు పనులు వేగవంతం చేశారు. రాయ్గడ్, ఠాణే జిల్లాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని స్థల సేకరణ పనులు పూర్తిచేశారు. అయితే రాడార్ను ముంబైలోనే ఏర్పాటుచేయాలని వాతావరణ శాఖ పట్టుబట్టింది. దీంతో కొద్ది నెలలుగా స్థల సేకరణ పనులు చేపట్టగా ఎట్టకేలకు ఉప నగరంలో స్థలాన్ని నిర్ణయించారు.
ముంబై లో మరో ‘వెదర్ డాప్లర్ రాడార్’
Published Wed, May 13 2015 12:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement