మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించి రమ్మని భగవంతుడే తుపాన్ను పంపించారని ఇసైజ్ఞాని ఇళయరాజా వ్యాఖ్యానించారు. ఇటీవల తమిళనాడును తుపాన్ కుదిపేసిన విషయం తెలిసిందే. బాధితులను పలువురు పలు విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. వారందరికి ధన్యవాదాలు తెలిపి ప్రసంశా పత్రాలను అందించే కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక ఎగ్మోర్లోని ఎతిరాజ్ కళాశాల ఆవరణలో జరిగింది.
ఇందులో ఇళయరాజా, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ముఖ్య అతిథులుగా పాల్గొని వరద బాధితులకు ఆపన్న హస్తం అందించిన వారిని అభినందించారు. ఇళయరాజా మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తుపాన్ చాలా మందిని బాధించిన మాట వాస్తవం అన్నారు. మరో పక్క అది మనుషుల్లోని మానవత్వాన్ని మేలుకొలపడానికి దోహద పడిందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తిలోనూ మానవత్వం దాగి ఉంటుందని, దాన్ని ముందుగానే ప్రదర్శించి ఉంటే ఈ తుపాన్ వచ్చి ఉండేది కాదని అన్నారు.
వానలు, వరదలు లాంటివి భగవంతుని ఆదేశానుసారంగా వస్తుంటాయన్నారు. ఆ భగవంతుడే మనుషుల్లోని మానవత్వాన్ని మేలుకొలిపి రమ్మని తుపాన్కు చెప్పి పంపించారని అన్నారు. తాను ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడనని అలాంటిది వరద బాధితులను కలుసుకోవడానికి సాహసించడం అన్నది భావమే కారణం అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఈ తుపాన్ సూచించిందన్నారు. అయితే అది దాని వల్ల కలిగిన నష్టం మాత్రం పూడ్చలేనిదని ఇళయరాజా అన్నారు.
దేవుడే పంపించాడు
Published Mon, Jan 18 2016 1:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement