వరంగల్‌ జైలులో ఇటుకల పరిశ్రమ మూసివేత | bricks factory closed in warangal central jail | Sakshi
Sakshi News home page

వరంగల్‌ జైలులో ఇటుకల పరిశ్రమ మూసివేత

Apr 22 2017 4:08 PM | Updated on Sep 5 2017 9:26 AM

వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలు నిర్వహించే ఇటుకల పరిశ్రమను మూసివేశారు.

వరంగల్‌: వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలు నిర్వహించే ఇటుకల పరిశ్రమను మూసివేశారు. జైలు ఇన్‌చార్జ్ పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తున్న సంపత్‌కు కాంట్రాక్టర్ లవకుమార్ రూ.3 లక్షల  లంచం ఇవ్వలేదనే అక్కసుతో ఇటుకల పరిశ్రమను మూసివేయించారు. దీం‍తో 60మంది జీవిత ఖైదీలు ఉపాధిని కోల్పోయారు. పైగా ఖైదీలకు వడ్డించే ఆహారంలో నాణ్యత పాటించడం లేదంటూ కొంతమంది ఖైదీలను పావుగా వాడుకుని కాంట్రాక్టర్‌ లవకుమార్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయించారు కూడా. దీనిపై విచారణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement