ఎన్‌డీఎంసీ సభ్యునిగా నామినేట్ అయిన కేజ్రీవాల్ | Arvind Kejriwal Nominated Member NMDC | Sakshi
Sakshi News home page

ఎన్‌డీఎంసీ సభ్యునిగా నామినేట్ అయిన కేజ్రీవాల్

Mar 11 2015 11:11 PM | Updated on Sep 2 2017 10:40 PM

న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నన ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సురేందర్ సింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నన ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సురేందర్ సింగ్‌ని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) సభ్యులుగా నామినేట్ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరూ ఈ నెల 20న ఎన్డీఎంసీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త సభ్యుల చేరిక తర్వాత ఎన్‌డీఎంసీ 2015-16కి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మార్చి 25న ప్రవేశపెడతారు. ఇదిలా ఉండగా కరావల్ నగర్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షునిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement