నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
Aug 30 2016 12:44 PM | Updated on Aug 29 2018 1:59 PM
చిలుకూరు: నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో మంగళవారం ఉదయం పిడుగుపడి వీరబాబు(32) అనే రైతు మృతి చెందాడు. వీరబాబు పొలంలో పనిచేసుకుంటుండగా పిడుగుపడింది. దాంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో వైపు మునగాలలో పిడుగుపడి బాలకృష్ణ(28) అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. మునగాల హైస్కూల్ పక్కన నీళ్లు పడుతుండగా పిడుగుపడి బాలకృష్ణ మృతిచెందాడు.
Advertisement


