ఇంగ్లండ్‌ 277 ఆలౌట్‌

West Indies vs England 3rd Test  updates - Sakshi

సెయింట్‌ లూసియా: వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయి ఇప్పటికే వెస్టిండీస్‌కు సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టు కష్టాలు మూడో టెస్టులోనూ కొనసాగుతున్నాయి. ఒకదశలో 232/4తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్‌ రెండో రోజు తొలి సెషన్‌లో తడబడింది. విండీస్‌ పేసర్‌ కీమర్‌ రోచ్‌ (4/48) ధాటికి ఇంగ్లండ్‌ చివరి ఆరు వికెట్లను 45 పరుగుల తేడాలో కోల్పోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో 101.5 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. బట్లర్‌ (127 బంతుల్లో 67; 9 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (175 బంతుల్లో 79; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఐదో వికెట్‌కు 125 పరుగులు జోడించారు. విండీస్‌ బౌలర్లలో గాబ్రియెల్, అల్జారీ జోసెఫ్, కీమో పాల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. కడపటి వార్తలు అందే సమయానికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.     

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top