
వెస్టిండీస్ 140/3
పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ నిలకడగా ఆడుతోంది.
రోసెవూ: పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ మూడో రోజు శుక్రవారం కడపటి వార్తలందేసరికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
రోస్టన్ ఛేజ్ (32), షై హోప్ (26) క్రీజ్లో ఉన్నారు. పావెల్ (31), బ్రాత్వైట్ (29), హెట్మైర్ (17) అవుటయ్యారు. పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా ఈ మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. మూడు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్నాయి.