ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా(148/8)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 143 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్(5) పరుగులు చేసి ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4), సురేష్ రైనా(1), అంబటి రాయుడు (23), మహేంద్ర సింగ్ ధోనీ(34), కేఆర్ పాటిల్ (0) కే పెవిలియన్ కు చేరారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ ఐదు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు.