దక్షిణ మధ్య రైల్వే జట్టుకు టైటిల్‌

SCR women bag title in Kabaddi Championship - Sakshi

ఆలిండియా రైల్వే కబడ్డీ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా రైల్వే మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో ఆతిథ్య దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్‌ లోని రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీ లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఎస్‌సీఆర్‌ 37–17తో సెంట్రల్‌ రైల్వేపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో వెస్ట్రన్‌ రైల్వే, నార్తర్న్‌ రైల్వే వరుసగా 3, 4 స్థానాలను సాధించాయి. బహుమతి ప్రధానోత్సవంలో ఎస్‌సీఆర్‌ జీఎం వినోద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అమిత్‌ వరదన్, హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top