సలీమ్నగర్ బ్యాట్స్మన్ ఎం.మహేందర్ (107 నాటౌట్) అజేయ సెంచరీ సాధించడంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో గౌడ్స్ ఎలెవన్ జట్టుపై గెలుపొందింది.
ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్
సాక్షి, హైదరాబాద్: సలీమ్నగర్ బ్యాట్స్మన్ ఎం.మహేందర్ (107 నాటౌట్) అజేయ సెంచరీ సాధించడంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో గౌడ్స్ ఎలెవన్ జట్టుపై గెలుపొందింది. ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గౌడ్స్ ఎలెవన్ 175 పరుగులకు ఆలౌటయింది. ఓవర్నైట్ స్కోరు 123/1తో శుక్రవారం ఇన్నింగ్స్ కొనసాగించిన సలీమ్నగర్ జట్టు.. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. మరో మ్యాచ్లో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు 30 పరుగుల తేడాతో ఆక్స్ఫర్డ్ బ్లూస్పై విజయం సాధించింది. తొలుత స్పోర్టింగ్ జట్టు 160 పరుగులు చేసి... ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ను 130 పరుగులకే పరిమితం చేసింది. స్పోర్టింగ్ బౌలర్లలో చంద్రకాంత్ 4, హరిశివ మూడు వికెట్లు తీశారు.
ఇతర మ్యాచ్ల వివరాలు: న్యూ బ్లూస్: 202 (సాయి చరణ్ 81; ప్రతీక్ 3/46, సుక్మీన్ 3/17), కొసరాజు: 206/5 (సుఖీన్ జైన్ 82 నాటౌట్, యశ్వంత్రెడ్డి 53; పూజిత్ వంశీ 4/46); ఖల్సా: 116 (కె.నాగరాజు 4/26, వినయ్కుమార్ 3/21), గుజరాతీ: 120/4.