పది నెలలుగా సచిన్‌ టెండూల్కర్ ను కలవలేదు! | Reports of Tendulkar's retirement rubbished : Sandip Patil | Sakshi
Sakshi News home page

పది నెలలుగా సచిన్‌ టెండూల్కర్ ను కలవలేదు!

Sep 18 2013 10:59 PM | Updated on Sep 1 2017 10:50 PM

సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు తర్వాత అతని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని, ఇదే విషయాన్ని మాస్టర్‌కు స్వయంగా చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ కలిసి చెప్పినట్లు మీడియాలో వచ్చిన కథనాన్ని పాటిల్ కొట్టి పారేశారు.

ముంబై: సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు తర్వాత అతని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామని, ఇదే విషయాన్ని మాస్టర్‌కు స్వయంగా చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ కలిసి చెప్పినట్లు మీడియాలో వచ్చిన కథనాన్ని పాటిల్ కొట్టి పారేశారు. అసలు తాను సచిన్‌ను కలిసి దాదాపు పది నెలలు అయిందని ఆయన అన్నారు. మాస్టర్ గొప్పతనాన్ని తగ్గించలేమని...అయితే ప్రతిభ గల యువ ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుంటూ తాము భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తున్నామని, ఈ పరిస్థితిని అర్ధం చేసుకోవాలంటూ సచిన్‌కు వివరించినట్లు కూడా ఈ కథనంలో ఉంది. ఒక సెలక్టర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు కూడా ఆ పత్రిక రాసింది.
 
 

‘సచిన్‌ను కలవడాన్ని నేను ఎప్పుడైనా ఇష్ట పడతాను. కానీ దాదాపు 10 నెలలుగా నేను అతడిని కలవలేదు. అతను నాకు గానీ, నేను సచిన్‌కు గానీ కనీసం ఫోన్ కూడా చేయలేదు. మేం ఏ విషయాన్నీ చర్చించలేదు. ఆ వార్త అంతా శుద్ధ అబద్ధం’ అని సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. మరో వైపు బీసీసీఐ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. ‘మేం అటు సచిన్‌తో, ఇటు పాటిల్‌తో కూడా మాట్లాడాం. వారిద్దరి మధ్య ఎలాంటి చర్చా జరగలేదు. రిటైర్మెంట్‌పై స్వయంగా ఆటగాడే నిర్ణయం తీసుకోవాలనేది బోర్డు పాలసీ. దానిని ఎల్లప్పుడూ అనుసరిస్తూనే ఉన్నాం’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే 198 టెస్టులు ఆడిన సచిన్ వచ్చే నవంబరులో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో 200 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement