‘కామన్వెల్త్’కు రజని
భారత మహిళల హాకీ జట్టులో స్థానం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును బుధవారం ప్రకటించారు. స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ నేతృత్వంలో 18 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్ కీపర్ ఇతిమరపు రజనికి చోటు దక్కింది.
ఈ జట్టుకు ప్రధాన గోల్ కీపర్ సవిత వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. వచ్చే నెల 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో ఈ ప్రతిష్టాత్మక క్రీడలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా జరిగే హాకీ ఈవెంట్లో భారత్... మలేసియా, వేల్స్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలతో కలిసి పూల్ ‘ఎ’లో ఉంది. ఏప్రిల్ 5న జరిగే తమ తొలి మ్యాచ్లో వేల్స్తో భారత్ తలపడుతుంది.
మరిన్ని వార్తలు