
పాక్ను బతికించిన ‘వెలుతురు’
పాకిస్తాన్తో తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయ లక్ష్యం 21 కనీస ఓవర్లలో 99 పరుగులు.
ఇంగ్లండ్తో తొలి టెస్టు ఉత్కంఠభరిత ‘డ్రా’
అబుదాబి: పాకిస్తాన్తో తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయ లక్ష్యం 21 కనీస ఓవర్లలో 99 పరుగులు. ఛేదనలో ఇంగ్లండ్ ధాటిగా ఆడి 11 ఓవర్లలో 4 వికెట్లకు 74 పరుగులు చేయడంతో ఉత్కంఠ పెరిగింది. మరో 25 పరుగులు చేస్తే చారిత్రాత్మక గెలుపు ఆ జట్టు సొంతమవుతుంది. అయితే ఈ దశలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్ను నిలిపేయాల్సి వచ్చింది. మిగతా ఓవర్ల ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ నిరాశగా వెనుదిరగ్గా, పాక్ ఓటమి కోరల్లోంచి బయటపడింది.
నాలుగు రోజుల పాటు పరుగుల వరదతో నిస్సారంగా మారిన ఈ మ్యాచ్ చివరి రోజు శనివారం అనూహ్య మలుపు తిరిగింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 598/9 వద్ద డిక్లేర్ చేసి 75 పరుగుల ఆధిక్యం అందుకుంది. అనంతరం పాక్ తమ రెండో ఇన్నింగ్స్లో 173 పరుగులకే కుప్పకూలింది. మొదటి టెస్టు ఆడుతున్న లెగ్స్పిన్నర్ ఆదిల్ రషీద్ (5/64) విజృంభణతో పాక్ 14 పరుగులకే తమ చివరి 5 వికెట్లు కోల్పోయింది. కుక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో టెస్టు గురువారం నుంచి దుబాయ్లో జరుగుతుంది.