దక్షిణ కొరియాతో మ్యాచ్‌ డ్రా

Match Drawn between South korea and Telanganas friendly match - Sakshi

అంతర్జాతీయ జట్టుతో తెలంగాణ ఫ్రెండ్లీ మ్యాచ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు దక్షిణ కొరియా కబడ్డీ జట్లు ప్రాక్టీస్‌ కోసం నగరానికి తరలివచ్చాయి. అమెచ్యూర్‌ కబడ్డీ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని కాసాని జె.ఎస్‌ గెహ్లాట్‌ కబడ్డీ అకాడమీలో తెలంగాణ పురుషుల, మహిళల, దక్షిణకొరియా పురుషుల, మహిళల జట్ల మధ్య ఈ నెల 18 వరకు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

తెలంగాణ పురుషుల, దక్షిణ కొరియా పురుషుల జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌ 38–38 పాయింట్లతో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా శాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘తెలంగాణ క్రీడాకారులకు ఇది చక్కటి అవకాశం. అంతర్జాతీయ ఆటగాళ్లతో ఆడే అవకాశం లభించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా తెలంగాణ కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి, ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌రావు, జగ్మోహన్, జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top