ఐపీఎల్-8 సీజన్లో మరో కీలక పోరు జరగబోతోంది.
ముంబై: ఐపీఎల్-8 సీజన్లో మరో కీలక పోరు జరగబోతోంది. శనివారం రాత్రి 8 గంటల నుంచి జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ చావోరేవో తేల్చుకోనున్నాయి. ఇరు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్. గెలిచిన జట్టు నేరుగా ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ముఖ్యంగా రాజస్థాన్కు. రాజస్థాన్ నాకౌట్కు చేరాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. లేకుంటే ఇంటికే. ఈ మ్యాచ్లో కోల్కతా ఓడినా అవకాశాలు ఉంటాయి. అయితే రన్రేట్పై ఆధారపడి ఉంటుంది. పాయింట్ల పట్టికలో కోల్కతా (15) మూడో స్థానంలో ఉండగా, రాజస్థాన్ (14) ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్లో వాట్సన్ సారథ్యంలోని రాజస్థాన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించినా ఆనక వెనకబడింది. ఇక గంభీర్ నాయకత్వంలోని కోల్కతా కీలక సమయంలో రాణించింది.