
దక్షిణాఫ్రికాదే తొలి వన్డే
భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది.
2 వికెట్లతో భారత్పై గెలుపు
బెంగళూరు: భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది. సోమవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 38.5 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. జులన్ గోస్వామి (33), హర్మన్ప్రీత్ కౌర్ (31) ఐదో వికెట్కు 63 పరుగులు జోడించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది.
వాన్ నీ కెర్క్ (4/9), మరిజేన్ కాప్ (4/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. 31 పరుగులకే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. అయితే క్లో ట్రయాన్ (80 బంతుల్లో 50; 7 ఫోర్లు) ఒంటరిగా పోరాడి దక్షిణాఫ్రికాను గెలిపించింది. ఆ జట్టు 41.1 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు సాధించింది. జులన్కు 3 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే మైదానంలో బుధవారం జరుగుతుంది.