the South African womens team
-
దక్షిణాఫ్రికాదే తొలి వన్డే
2 వికెట్లతో భారత్పై గెలుపు బెంగళూరు: భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది. సోమవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 38.5 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. జులన్ గోస్వామి (33), హర్మన్ప్రీత్ కౌర్ (31) ఐదో వికెట్కు 63 పరుగులు జోడించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. వాన్ నీ కెర్క్ (4/9), మరిజేన్ కాప్ (4/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. 31 పరుగులకే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. అయితే క్లో ట్రయాన్ (80 బంతుల్లో 50; 7 ఫోర్లు) ఒంటరిగా పోరాడి దక్షిణాఫ్రికాను గెలిపించింది. ఆ జట్టు 41.1 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు సాధించింది. జులన్కు 3 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే మైదానంలో బుధవారం జరుగుతుంది. -
భారత మహిళల ఇన్నింగ్స్ విజయం
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు మైసూర్: దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఫాలోఆన్ ఆడుతూ...ఓవర్నైట్ స్కోరు 83/6తో బుధవారం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా 78.2 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. త్రిషా చెట్టి (35), క్లో ట్రయాన్ (30 నాటౌట్) ఏడో వికెట్కు 53 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. 12 పరుగుల తేడాతో ఆ జట్టు చివరి 4 వికెట్లు కోల్పోవడం విశేషం. భారత బౌలర్లలో హర్మన్ప్రీత్ కౌర్కు 4 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్లో హర్మన్ (9/85) భారత్ తరఫున టెస్టుల్లో రెండో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. టెస్టులో 10 వికెట్లు తీసిన భారత బౌలర్ (10/78) రికార్డు జులన్ గోస్వామిది. సంక్లిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ 400/6 డిక్లేర్డ్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 234, రెండో ఇన్నింగ్స్ 132.