
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీంఇండియా ఆరో వికెట్ కోల్పోయింది.
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీంఇండియా ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ధోని స్టార్క్ బౌలింగ్లో అవుటయ్యాడు. తరువాత వచ్చిన యువ ఆటగాడు అక్షర్ పటేల్ రెండు బంతులాడి పరుగులేమీ చేయకుండానే స్టార్క్ బౌలింగ్లో వెనుదిరిగాడు. జట్టు స్కోరు 45 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.
ఓపెనర్ రోహిత్ శర్మ 131 బంతుల్లో 127 పరుగులు, అశ్విన్ పరుగులు ఏమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9), రైనా (51) , ధోని (19), అక్షర్ పటేల్ (0) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు , ఫాల్క్నర్, గురిందర్ చెరో వికెట్ తీశారు.