భారత్‌కు కాంస్యం | India bag silver, bronze at Antalya Archery World Cup | Sakshi
Sakshi News home page

భారత్‌కు కాంస్యం

Jun 15 2014 1:43 AM | Updated on Sep 2 2017 8:48 AM

భారత్‌కు కాంస్యం

భారత్‌కు కాంస్యం

ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పూర్వాషా షిండే, త్రిషా దేబ్, లిల్లీ చానులతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గింది.

అంటాల్యా (టర్కీ): ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పూర్వాషా షిండే, త్రిషా దేబ్, లిల్లీ చానులతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గింది.
 
 మూడో స్థానం పోరులో భారత్ 226-224 పాయింట్లతో బ్రెండా మెరినో, లిండా ఒచావో, కాట్యా సోఫియాలతో కూడిన మెక్సికో జట్టును ఓడించింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో రజత్ చౌహాన్ 141-145 పాయింట్లతో యోంగ్ చోయ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయి రజత పతకం సొంతం చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement