ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇయాన్ బెల్ (50), జేమ్స్ టేలర్(30) పరుగులు చేయడంతో ఇంగ్లండ్ గెలుపు నల్లేరుపై నడకలా సాగుతోంది. ప్రస్తుతం 18.1 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా 153 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.