ఇంగ్లండ్కు ఆధిక్యం
వెస్టిండీస్తో చివరి టెస్టు
గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్కు టెస్టు సిరీస్ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్ మూడో టెస్టును సొంతం చేసుకునే ప్రయత్నంలో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 154 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్కు 123 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. క్యాంప్బెల్ (63 బంతుల్లో 41; 3 ఫోర్లు, సిక్స్), డౌరిచ్ (56 బంతుల్లో 38; 6 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు.
పేసర్ మార్క్ వుడ్ (5/41) కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లతో చెలరేగగా... స్పిన్నర్ మొయిన్ అలీ 4 వికెట్లతో ప్రత్యర్థిని కూల్చాడు. అనంతరం ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో కడపటి వార్తలందే సరికి 3 వికెట్లకు 160 పరుగులు చేసింది. జెన్నింగ్స్ (23), బర్న్స్ (10), డెన్లీ (69) ఔట్ కాగా... రూట్ (26 బ్యాటింగ్), బట్లర్ (11 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 283 పరుగులు ముందంజలో ఉంది.
మరిన్ని వార్తలు