ముక్కోణపు సిరీస్ లో ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.
బ్రిస్బేన్:ముక్కోణపు సిరీస్ లో ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. 25 పరుగుల వద్ద మహ్మద్ అలీ(8) వికెట్ ను ఇంగ్లండ్ కోల్పోయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 153పరుగులకే చాపచుట్టేసింది. ఆదిలో శిఖర్ ధావన్(1) వికెట్ కోల్సోయిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు.
ఈ మ్యాచ్ లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34), స్టువర్ట్ బిన్నీ (44),అజ్యింకా రహానే(33), అంబటి రాయుడు(23) పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.