ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.
బ్రిస్బేన్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. ఆదిలోనే మహ్మద్ అలీ(8) వికెట్ ను ఇంగ్లండ్ కోల్పోయినా.. ఇయాన్ బెల్(46), జేమ్స్ టేలర్ (26) తడబడకుండా ఆటను కొనసాగిస్తున్నారు. లక్ష్యం చిన్నది కావడంతో ఇరువురి ఆటగాళ్లు నెమ్మదిగా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు.
అంతకుముందు టీమిండియా 153 పరుగులకే ఆలౌటయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటీమిండియా 39.3 ఓవర్లకే చాపచుట్టేసి స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఇంగ్లండ్ నిర్దేశించింది.