ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఆశిష్ నెహ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే 22 వికెట్లతో ధోనిసేన ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంత అద్భుతంగా ఎలా బౌలింగ్ చేస్తున్నారని అడిగితే నెహ్రా కాస్త భిన్నంగా స్పందించాడు. ‘నేను గత 10 సంవత్సరాలుగా నిలకడగానే ఆడుతున్నాను. ఐపీఎల్లో అవకాశం లభించిన ప్రతి సీజన్లోనూ రాణించాను. కానీ ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు. వయసైపోయిన వ్యక్తి వికెట్లు తీస్తున్నాడని ఇప్పుడు నన్ను గుర్తిస్తున్నారనుకుంటా’ అని అన్నాడు.
Related news
-
4 గంటల మ్యాచ్లు రద్దు!
ఐపీఎల్-8 అన్ని రకాలుగా విజయవంతం అయిందని ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. టోర్నీకి సంబంధించి కొన్ని గణాంకాలు ఆయన వెల్లడించారు. 20 శాతం టీవీ రేటింగ్లు, స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య 15 శాతం పెరిగాయని... తొలి ఐపీఎల్తో పోలిస్తే ఆదాయం 120 శాతం పెరిగిందన్న ఠాకూర్, ఓవరాల్గా 200 కోట్ల మంది ఐపీఎల్ చూశారని వివరించారు. కొత్తగా 16 నగరాల్లో ఈసారి ఏర్పాటు చేసిన ‘ఫ్యాన్ పార్క్’ సిస్టం కూడా విజయవంతమైందని, గుంటూరులో 20 వేల మంది చూశారని ఠాకూర్ చెప్పారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఐపీఎల్లో దాదాపు ప్రతీ చోటా మ్యాచ్లు చూశారని, భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్ల లీగ్ ప్రదర్శనపై కూడా వారు ఓ కన్నేసి ఉంచారని గుర్తు చేశారు. కొన్ని మ్యాచ్ ఫలితాలపై ఈడీ దృష్టి పెట్టిందనడంలో వాస్తవం లేదని, ఒకే ఒక ఆటగాడిని బుకీలు సంప్రదిస్తే అతను వెంటనే ఏసీయూకు సమాచారం అందించాడని ఆయన చెప్పారు. ఐపీఎల్లో 4 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ల రద్దు, అన్క్యాప్డ్ ప్లేయర్ల గురించి చర్చ జరిగిందని, వీటిపై తుది నిర్ణయం తర్వాత తీసుకుంటామని ఆయన చెప్పారు. -
సంబరాలు చేసుకుందాం రండి
ముంబై: రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ సొంతగడ్డపై సంబరాలకు రెడీ అయింది. టైటిల్ గెలిచి జోష్ మీదున్న రోహిత్ సేన సోమవారం రాత్రి వాంఖేడ్ స్టేడియంలో సంబరాలు చేసుకోనుంది. వేడుకల్లో పాల్గొనాలని అభిమానులను కోరింది. రాత్రి 8 గంటలు సంబరాలు ప్రారంభమవుతాయి. ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు, టీమ్ మెంటార్ సచిన్ టెండూల్కర్, అతడి కుటుంబ సభ్యులు, సహ యాజమాని నీతా అంబానీ పాల్గొంటారు. కోల్ కతా నుంచి రోహిత్ సేన సోమవారం సాయంత్రానికి ముంబై చేరుకుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. సంబరాలు వీక్షించేందుకు వచ్చే అభిమానులను ఉచితంగా వాంఖేడ్ స్టేడియంలోకి అనుమతిస్తారు. ముందు వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తారు. -
ఇదో గొప్ప ప్రయాణం: రోహిత్ శర్మ
కోల్ కతా: ఐపీఎల్-8 టైటిల్ సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్ తమ ప్రయాణం గొప్పగా సాగిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ విజేతగా నిలిచిన తన జట్టును ఇంకేమీ అడగబోనని అన్నాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను 41 పరుగుల తేడాతో ఓడించి ముంబై టైటిల్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 26 బంతుల్లో 50 పరుగులు చేసిన రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. 'ఇదో గొప్ప ప్రయాణం. దీనికి మించి ఇంకేమీ అడగను. టైటిల్ పోరులో మా ఆటగాళ్లు బాగా ఆడారు. మరిచిపోలేని విజయం అందించారు' అని రోహిత్ శర్మ అన్నాడు. వరుస ఓటముల నుంచి పుంజుకున్న తీరు అనూహ్యమని పేర్కొన్నాడు. -
18 వేల 332 పరుగులు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్ లో స్కోరు బోర్డుపై నమోదైన మొత్తం పరుగులు ఎన్నో తెలుసా. అక్షరాల 18 వేల 332 పరుగులు. ఇందులో బౌండరీల ద్వారా వచ్చిన రన్స్ 10,58. ఇందులో 89 అర్ధ సెంచరీలున్నాయి. పరుగుల వీరులు 692 సిక్సర్లు బాదారు. 'సిక్సర' పిడుగు క్రిస్ గేల్ అత్యధికంగా 38 సార్లు బంతిని బౌండరీ దాటించాడు. అత్యధికంగా 108 మీటర్ల వరకు బంతి వెళ్లింది. ఈసారి ఐపీఎల్ లో686 వికెట్లు పడ్డాయి. ఫాస్టెస్ట్ బాల్ వేగం 151.11 కేపీహెచ్(మిచెల్ జాన్సన్) గా నమోదైంది. వయసు పెరిగినా తన బౌలింగ్ పదును తగ్గలేదని నిరూపించిన ఆశిష్ నెహ్రా బెస్ట్ బౌలింగ్ (4/10) గణాంకాలు తన పేరిట లఖించుకున్నాడు. 26 వికెట్లతో డ్వెన్ బ్రేవో టాప్ బౌలర్ గా నిలిచాడు. ఎలా బడితే అలా బాదేసే ఏబీ డివిలియర్స్ అత్యధిక వ్యక్తిగత స్కోరు(133) చేసిన ఆటగాడిగా నిలిచాడు. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్( 562) టాప్ స్కోరర్ అయ్యాడు. ఈసారి ఇండియా ఆటగాళ్లు సెంచరీలు కొట్టలేకపోయారు. డివిలియర్స్, క్రిస్ గేల్, బ్రెండన్ మెక్ కల్లమ్, షేన్ వాట్సన్ మాత్రమే శతకాలు బాదారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన పంజాబ్ చిత్తుగా ఓడిన రికార్డు సొంతం చేసుకుంది. బెంగళూరు చేతిలో 138 పరుగుల భారీ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. గతేడాది లీగ్ దశలో 22 పాయింట్లతో టాప్'గా నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంబాబ్ ఈసారి అట్టడుగు నుంచి 'ఫస్ట్'కు పతనమైంది. చివరి నుంచి రెండో స్థానంలో కుదురుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ తలరాత ఈసారి కూడా మారలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు అదృష్టం కలిసి రాలేదు. డిపెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేఆప్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. తన చివరి లీగ్ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కు చేరలేకపోయింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు మరోసారి నిరాశే ఎదురైంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తుది పోరులో తడబడింది. ఆరంభంలో ఎదురైన వరుస ఓటముల నుంచి అనూహ్యంగా పుంజుకుని ముంబై ఇండియన్స్ టీమ్ టైటిల్ ఎగరేసుకు పోవడం ఊహించని పరిణమామం. ఈ ఐపీఎల్ లో ఎవరు బెస్ట్... స్ట్రైక్ రేట్: ఆండ్రీ రసెల్(192.89) బ్యాటింగ్ సగటు: అజింక్య రహానే(49.09) అర్ధసెంచరీలు: డేవిడ్ వార్నర్(7) సిక్సర్లు: క్రిస్ గేల్(38) ఫోర్లు: డేవిడ్ వార్నర్(65) వేగవంతం సెంచరీ: క్రిస్ గేల్(46 బంతుల్లో) అర్ధ సెంచరీ: రసెల్, హర్భజన్(19 బంతుల్లో) అత్యుత్తమం బౌలింగ్ సగటు: హెన్సిక్స్(14.36) బౌలింగ్ ఎకానమి: అశ్విన్(5.84) డాట్ బాల్స్: అశిష్ నెహ్రా( 170) మెయిడిన్లు: సందీప్ శర్మ(4) అవార్డులు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: ఆండ్రీ రసెల్ ఎమర్జింగ్ ప్లేయర్: శ్రేయస్ అయ్యర్ బెస్ట్ క్యాచ్: డ్వేన్ బ్రేవో ఫేయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్ ఆరెంజ్ క్యాప్: డేవిడ్ వార్నర్(562 రన్స్) పర్పుల్ క్యాప్: డ్వేన్ బ్రేవో(26 వికెట్లు) -
రెండో ఓవర్ కొంప ముంచింది: ధోని
కోల్ కతా: మ్యాచ్ ను గెలిచిపించే వ్యక్తిగత ప్రదర్శన చేయకపోవడంతో ఐపీఎల్-8 ఫైనల్లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ సింగ్ ధోని అన్నాడు. తమ జట్టు పూర్తిస్థాయిలో రాణించక పోవడం కూడా ఓటమికి కారణమని విశ్లేషించాడు. మొహిత్ శర్మ వేసిన రెండో ఓవర్ తమ కొంప ముంచిందని వాపోయాడు. ముంబై పుంజుకోవడానికి, మ్యాచ్ తమ చేయి జారడానికి ఈ ఓవరే కారణమన్నాడు. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు, సిక్సర్ తో 16 పరుగులు పిండుకున్నాడు. భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన తమకు శుభారంభం లభించకపోవడం దెబ్బతీసిందన్నాడు. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ లేకపోవడం కూడా తమ విజయవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్నాడు. ప్లే ఆప్ లో పుంజుకోలేకపోవడంతో టైటిల్ చేజారిందన్నాడు. మొత్తంగా చూసుకుంటే తమ జట్టు ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని ధోని చెప్పాడు.
Related News by category
-
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
తీవ్ర విషాదం.. క్రికెటర్ ఈశ్వర్ ఇకలేరు
విశాఖపట్నం: జీవీఎంసీ 68వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన క్రికెటర్ సోముదల ఈశ్వర్(40) కన్నుమూశారు. ఆగస్టు 28వ తేదీనే ఆయన గుండెపోటుతో మృతి చెందగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాఖలో డివిజన్ క్రికెట్ ఆడుతూనే ఈశ్వర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏసీఏకు చేదోడు వాదోడుగానూ ఉంటూ.. టోర్నీల నిర్వహణలో సహాయం అందించేవాడు. అలా ఆయన ప్రతిభ ఐపీఎల్కు తాకింది. ఎడమ చేతి వాటం బౌలర్ అయిన ఈశ్వర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్లకు నెట్స్లో బంతులు విసిరేందుకు సహాయకుడిగా చేరాడు. ఐపీఎల్లో సపోర్టింగ్ స్టాఫ్గా ప్రస్థానం కొనసాగిస్తూనే.. విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్ పాల్గొన్నాడు. ఇటీవల ఏపీఎల్ సీజన్ ముగియడంతో అప్పన్నకాలనీలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నెల 28న స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చాడు. బైక్ దిగి స్టాండ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తల్లి రాములమ్మ తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడని బోరున విలపించారు. ఈ వార్త విన్న భారత క్రికెటర్ శ్రీకర్ భరత్.. ఈశ్వర్ ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈశ్వర్కు వివాహం కాలేదు. క్రికెటర్ వేణుగోపాల్తో సాన్నిహిత్యం తన 16వ ఏటనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈశ్వర్కు పేదరికం వెంటాడింది. 10వ తరగతి వరకు చదువుకున్న ఈశ్వర్ క్రికెట్టే ప్రపంచంగా భావించాడు. క్రికెటర్ వేణుగోపాల్, ఈశ్వర్ ఇద్దరూ రంజీ సెలక్షన్కు వెళ్లారు. వేణుగోపాల్ రంజీకి ఎంపిక కాగా.. ఈశ్వర్కు నిరాశే మిగిలింది. అయినా ఏనాడు కుంగిపోలేదు. ఈ క్రమంలో ఈశ్వర్పై అభిమానం పెంచుకున్న వేణుగోపాల్ తనతో పాటు పలు మ్యాచ్లకు తీసుకువెళ్లేవాడు. ఈశ్వర్ ఫాస్ట్ బౌలర్. గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఈశ్వర్ బౌలింగ్ అంటే భారత క్రికెటర్లకు ఎంతో ఇష్టం. అందుకే స్టార్ క్రికెటర్లు ఆయనతో బౌలింగ్ వేయించుకుని నెట్ ప్రాక్టీస్ చేసేవారు. దీంతో ఈశ్వర్కు ఎక్కువగా భారత క్రికెట్ క్యాంపుల్లో అవకాశం దక్కేది. అలా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రికీ పాటింగ్, డేవిడ్ వార్నర్.. తదితర ఎంతో మంది క్రికెటర్లకు అభిమానిగా మారాడు. ఈశ్వర్ను ఎక్సట్రా ప్లేయర్గా అన్ని విషయాల్లో సమానంగా చూసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మరణవార్త తెలుసుకున్న క్రికెటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మృతి బాధాకరం నేనూ ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ప్రస్తుత సీజన్ ఐపీఎల్లో ఆడాను. జట్టుతో పాటు ప్రాక్టీస్ చేసేప్పుడు ఈశ్వర్ నెట్స్లో బంతులు విసిరేవాడు. ఇద్దరం విశాఖ వాసులమే కావడంతో తొలినాళ్ల నుంచి అతనితో పరిచయం ఉంది. అతను అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరం. – భరత్, భారత టెస్ట్ క్రికెటర్ ప్రగాఢ సానుభూతి మా అన్ని శిక్షణ సెషన్స్, మ్యాచ్ల్లో జట్టుకు సహాయకారిగా ఉన్న ఈశ్వర్ను మిస్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మా ప్రియమైన సైడ్ ఆర్మ్ స్పెషలిస్ట్ ఈశ్వర్ ఇకలేరు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. – ఢిల్లీ కాపిటల్స్ మేనేజ్మెంట్ -
గోల్ కొట్టిన విరాట్కోహ్లీ.. జస్ట్మిస్
క్రికెట రారాజు విరాట్కోహ్లీ ... ఫుట్బాల్ మైదానంలో సందడి చేశాడు. క్రికెట్ ఆటలో ఎంతో కచ్చితత్వంతో బాల్ని బౌండరీలు దాటించే కోహ్లీ.. అదే తీరుని ఫుట్బాల్ మైదానంలోనూ చూపించాడు. ఆక్సిడెంటల్ క్రాస్బార్ ఛాలెంజ్ పేరుతో చాలా దూరం నుంచి గోల్పోస్ట్కి గురి పెట్టాడు కోహ్లీ. తన నైపుణ్యం అంతా ఉపయోగించి బాల్ని కిక్ చేశాడు. గోల్కీపర్ను తప్పించుకుని గోల్పోస్ట్లో బాల్ పడినట్టే అనిపించింది. అయితే చివరి క్షణంలో గోల్పోస్ట్ పోల్కి బాల్కి అడ్డుగా నిలిచింది. దీంతో గోల్ మిస్ అయ్యింది. క్రికెట్లోనే కాదు ఫుట్బాల్లోనూ కోహ్లీ ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు Accidental crossbar challenge 😂 pic.twitter.com/koeSSKGQeb — Virat Kohli (@imVkohli) May 25, 2021 -
ఇంగ్లండ్కు భారీ షాక్: న్యూజిలాండ్తో సిరీస్కు ఆర్చర్ దూరం
లండన్: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయం కారణంగా భారత్ పర్యటన, ఐపీఎల్లకు దూరమైన ఆర్చర్.. కౌంటీ క్రికెట్లో ససెక్స్ తరపున పునరాగమనం చేశాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన వెంటనే మైదానాన్ని వీడాడు. ఇంగ్లాండ్, ససెక్స్ సీమర్ జోఫ్రా ఆర్చర్ వచ్చే నెల న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బౌలింగ్ చేసేటప్పుడు అతని కుడి మోచేయి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ చివరి రెండు రోజులలో బౌలింగ్ చేయలేకపోయాడని ఈసీబీ వివరించింది. ఇంగ్లండ్,న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ జూన్ 2న లార్డ్స్ మైదానంలో ప్రారంభంకానుంది. చదవండి: శ్రీలంక ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత -
ఆటగాళ్లకు షాకిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆటగాళ్ల జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది. దీంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్,సురంగ లక్మల్,దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కేంద్ర ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ క్యాటగిరిలో వేసింది. దీంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 23 నుంచి బంగ్లాదేశ్లో ఈ జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్నది. కెప్టెన్కు కూడా తగ్గనున్న జీతం అద్భుతమైన ఫామ్లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయన జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన కరునరత్నే.. బంగ్లాదేశ్తో సిరీస్లో 3 ఇన్నింగ్స్లలో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు తగ్గించారు. (చదవండి:10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్)
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement