
40 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 206/4
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 40 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 40 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
ఓపెనర్ రోహిత్ శర్మ 117 బంతుల్లో 7 ఫోర్లు , 3 సిక్సర్లతో 109 పరుగులు చేసి ఆదుకున్నారు.. సెంచరీ హీరోకి తోడుగా కెప్టెన్ ధోని 22 బంతుల్లో రెండు ఫోర్లతో 12 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
తరువాత వచ్చని రహానే, కోహ్లి ఎవరూ క్రీజులో కుదురుకోకపోయినా తనదైన శైలిని మరోసారి కొనసాగిస్తున్నాడు. రోహిత్కు తోడుగా రైనా కూడా చక్కటి సహకారం అందిస్తున్నాడు. తనదైన శైలిలో అడపాదడనా ఫోర్లు బాదుతున్న రైనా అర్థ సెంచరీకి చేరువలో ఉన్నారు.
ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9), రైనా (51) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 , ఫాల్క్నర్, గురిందర్ చెరో వికెట్ తీశారు.