95వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, ఒంగోలు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 95వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. గురువారం ఉదయం ఆయన పెద్దఅలవలపాడు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రామాపురం, గుడేవారిపాలెం క్రాస్, హజీస్ పురం మీదగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర షెడ్యూల్ను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు.
పెద్దఅలవలపాడు వద్ద ముగిసిన పాదయాత్ర
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు వద్ద వైఎస్ జగన్ తన 94వ రోజు పాదయాత్రను ముగించారు. ఇవాళ ఆయన 13.5 కిలోమీటర్లు మేర నడిచారు. చెరువుకొమ్ముపాలెం, కె.అగ్రహారం, పర్చురివారిపాలెం, వెంగళాపురం క్రాస్ మీదగా పెద్ద అలవలపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర సాగింది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1275.9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.