‘అచ్చెదిన్‌ నినాదం సామాన్యులకు వర్తించదు’ | Rahul Gandhi Fires On Modi And KCR In Suryapet Election Campaign | Sakshi
Sakshi News home page
breaking news

మోదీ, కేసీఆర్‌ తోడు దొంగలు : రాహుల్‌

Apr 1 2019 6:07 PM | Updated on Apr 1 2019 6:42 PM

Rahul Gandhi Fires On Modi And KCR In Suryapet Election Campaign - Sakshi

సాక్షి, సూర్యాపేట : ప్రధాని నరేంద్ర మోదీ ‘అచ్చెదిన్‌’ నినాదం సామాన్య ప్రజలకు వర్తించదు.. అంబానీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీలాంటి వారకే వర్తిస్తుందని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. మోదీ దోపిడీదారులకే అండగా ఉంటూ.. విజయ్‌ మాల్యా లాంటి వారికి వేల కోట్ల రూపాయలు కట్టబెట్టారని ఆరోపించారు. దేశంలో రైతులు, నిరుద్యోగులు, పేదలు మోదీ పాలనపై విసుగు చెందారని తెలిపారు. ఇటు రాష్ట్రంలో కూడా కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందని.. పేదలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు.

మోదీ, కేసీఆర్‌ ఇద్దరు తోడు దొంగలే అని రాహుల్‌ గాంధీ విమర్శించారు. పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే పేద కుటుంబాల అకౌంట్‌లో ఏడాదికి రూ. 72 వేలు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మోదీ, కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించుకోవాలని రాహుల్‌ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement