కన్నడ రాజకీయంపై కోదండరామ్‌ వ్యాఖ్యలు

Prof Kodandaram Comments On Karnataka Politics - Sakshi

సాక్షి, కరీంనగర్: కర్ణాటకలోని రాజకీయ సంక్షోభంపై తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు కోదండరామ్‌ వ్యాఖ్యానించారు. కన్నడనాట జరుగుతున్న రాజకీయాలు బాధకలిగిస్తున్నాయన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న గలీజు రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం టీజేఎస్‌ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రక్షాళన కోసమే తెలంగాణ జనసమితి ఆవిర్భవించిందన్నారు. కౌలు రైతులకు పెట్టుబడికై భూరికార్డుల్లోని అక్రమాలను నిరసిస్తూ ఈ నెలాఖరులో ఖమ్మం నుంచి సడక్‌ బంద్‌ చేపట్టనున్నట్టు కోదండరామ్‌ ప్రకటించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top