కొత్త భవనాలు ఎవరి కోసం?: మల్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుపెడుతూ రాష్ట్రాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తోందని, సచివాలయం, కలెక్టరేట్ల నిర్మాణం పేరుతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీఎం సెక్రటేరియట్ వైపు కన్నెత్తి చూడకుండా, వందల కోట్ల ప్రజాధనంతో మరో ప్రాంతంలో నిర్మించడం సరి కాదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కుమారుడు జేఎస్ షా తరఫున కేంద్ర ప్రభుత్వానికి చెందిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేసు వాదించడం హాస్యాస్పదమని, ప్రభుత్వానికి చెందిన న్యాయవాది ప్రైవేట్ వ్యక్తి కేసు ఎలా వాదిస్తారో..? కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు