క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా..

 MV Mysura Reddy quits active politics - Sakshi

సాక్షి, కడప : క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి మైసూరారెడ్డి వెల్లడించారు. ఆయన ఆదివారం ఇక్కడ రాయలసీమ హక్కుల సాధనపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతం కోసమే పని చేస్తానని, రాజకీయేతర ఉద్యమం చేస్తానని తెలిపారు. ఉద్యమం పార్టీగా మారితే క్రియాశీలక పాత్ర పోషిస్తానని ఆయన పేర్కొన్నారు. సీమ సమస్యల పరిష్కారానికి అజయ్‌ కల్లం నేతృత్వంలో ఓ కమిటీ వేయనున్నట్లు మైసూరారెడ్డి ప్రకటించారు. రాయలసీమ హక్కుల సాధనకు మహాసభ నిర్వహించాలని నిర్ణయించామని, ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా చాలాకాలంగా మైసూరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం విదితమే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top