జనవరి 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు : కోడెల | Sakshi
Sakshi News home page

జనవరి 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు : కోడెల

Published Sat, Jan 26 2019 9:46 AM

Kodela Siva Prasada Rao Say AP Assembly Session Will Starts From January 30 - Sakshi

సాక్షి, అమరావతి : అమరావతిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30 నుంచి గవర్నర్‌ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ సమవేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఫిబ్రవరి 1,2,3 తీదీల్లో అసెంబ్లీకి సెలవు అని ప్రకటించారు. అనంతరం ఫిబ్రవరి 4న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.. 5న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశం.. 6 నుంచి 8 వరకూ బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని తెలిపారు.

Advertisement
Advertisement