నాలుగు స్థానాల్లో పోటీ చేస్తాం : కోదండరాం

Kodandaram Reddy Says TJS Contesting From Four Parliament Constituencies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌ సభ ఎన్నికల్లో తమ పార్టీ నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, మల్కాజిగిరితో పాటు.. మరోక నియోజకవర్గంలో టీజేసీ సొంతంగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. పోటీ లేని చోట కాంగ్రెస్‌కు బయట నుంచి మద్దతు ఇస్తామని తెలిపారు. పోటీలో ఉంటేనే భవిష్కత్‌లో తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్న ఉద్దేశ్యంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నెల 16,17న రెండు రోజుల పాటు భద్రాచలం​ నుంచి మేడారం వరకు ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర చేపడతామని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top