వైఎస్‌ జగన్‌పై దాడి అమానుషం: పవన్‌ కల్యాణ్‌

Janasena President Pawan Kalyan Condemns Attack On YS Jagan Mohan Reddy - Sakshi

అమరావతి : వైఎస్సార్‌సీపీ అధినేత వైస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం అత్యంత అమానుషమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్ష నేతపై జరిగిన దాడిని జనసేన తీవ్రమైనదిగా భావిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగరాదని జనసేన బలంగా కోరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ హత్యాయత్నాన్ని ప్రజస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని పవన్‌ పిలుపునిచ్చారు.

గాయం నుంచి జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని పవన్‌ ఆకాంక్షించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి కుట్రదారులను కఠినంగా శిక్షించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top