గుజరాత్, హిమాచల్ ఓట్ల లెక్కింపు.. లైవ్ అప్ డేట్స్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్లో బీజేపీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు ఫలితాలను బట్టి అర్థమౌతోంది. దీంతో ఆరోసారి బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గతంతో పోలిస్తే కాంగ్రెస్ ఓటింగ్ శాతం ఇక్కడ పెరిగినట్లు స్పష్టమౌతోంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ ఆధిక్యం కనబరిచి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.