చందాల మోహన్‌ రెడ్డిగా అవతారమెత్తాడు | Sakshi
Sakshi News home page

చందాల మోహన్‌ రెడ్డిగా అవతారమెత్తాడు

Published Fri, Apr 13 2018 1:26 PM

Embodiment As Chandala Mohan Reddy - Sakshi

నెల్లూరు : ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మిల్లర్ల దగ్గర చందాలు వసూలు చేసుకుంటూ చందాల మోహన్‌ రెడ్డిగా అవతారం ఎత్తి రైతాంగం సమస్యను విస్మరించారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి మండిపడ్డారు. మనుబోలు మండలం అక్కంపేట, వీరంపల్లి గ్రామాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని కాకాణి పరిశీలించారు.  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..‘  అన్నం పెట్టే రైతన్న తాను పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక కన్నీరు పెడుతున్నామంత్రి సోమి రెడ్డికి కనికరం లేదు. సోమిరెడ్డి ప్రకటనలతో మిల్లర్లకు ఆదాయం తప్ప, రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు’ అని మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement