న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం పన్ను ఉగ్రవాదానికి దారి తీసిందని బీజేపీ అసమ్మతి నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా విమర్శించారు. పేర్లు ప్రస్తావించకుండానే ప్రధాని మోదీని పిచ్చి తుగ్లక్గా పేరుమోసిన 16వ శతాబ్దపు ఢిల్లీ రాజు మహ్మద్ బిన్ తుగ్లక్తో పోల్చారు. ఆర్థిక వేత్త అరుణ్ కుమార్ రాసిన ‘డీమానెటైజేషన్ అండ్ ద బ్లాక్ ఎకానమీ’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడారు. పెద్దనోట్లను ఉపసంహరించడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయని మోదీ చెప్పారో వాటిలో ఏ ఒక్కటీ జరగలేదన్నారు.
నోట్ల రద్దుతో పన్ను ఉగ్రవాదం: యశ్వంత్ సిన్హా
Published Tue, Mar 20 2018 2:15 AM
Related news
-
యూపీఏకు ప్రజామోదం
2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారమంతా లౌకికవాదం, ఉగ్రవాదం, మతతత్వం చుట్టూ తిరిగింది. ఐదేళ్లలో అభివృద్ధిని కాంగ్రెస్ ప్రధానంగా నమ్ముకుంది. ఉద్యోగావకాశాల కల్పన, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలను ప్రజలకు గుర్తు చేసింది. మత, భాష, ప్రాంతీయ వాదం, కుల వాదాలకు తాము వ్యతిరేకమంటూ ప్రచారం చేసింది. యూపీఏ హయాంలో ఉగ్రవాదం పెచ్చు మీరిందని బీజేపీ ఎంతగా ప్రచారం చేసినా జనం పట్టించుకోలేదు. మరోవిడత యూపీఏనే ఆశీర్వదించారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2009లో 15వ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుంచి మే 13 దాకా ఐదు దశల్లో జరిగాయి. 2004లో జనం తన పాలనను తిరస్కరించడంతో నొచ్చుకున్న వాజ్పేయి ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. దాంతో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎల్కే అద్వానీ తెరపైకి వచ్చారు. కానీ ఆయన పట్ల పలు ప్రాంతీయ పార్టీలు సానుకూలంగా లేవు. యూపీఏలోనూ కాస్త అనిశ్చితి నెలకొంది.మళ్లీ గెలిస్తే రాహుల్ను ప్రధాని చేస్తారన్న ప్రచారం సాగినా మన్మోహనే కొనసాగుతారని సోనియా స్పష్టం చేశారు. ఎన్నికలకు 5 నెలల ముందు ముంబై ఉగ్ర దాడి 170 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో యూపీఏ, ఎన్డీఏ కూటముల్లో దేనికీ మెజారిటీ రాకపోవచ్చని అంతా అంచనా వేశారు. కాంగ్రెస్ బలం 145 నుంచి 206 ఎంపీలకు పెరిగింది. బీజేపీ 22 స్థానాలు కోల్పోయి 116కు పరిమితమైంది. యూపీఏకు 261 స్థానాలు దక్కాయి. మిత్రపక్షాల సాయంతో మొత్తం 322 మంది ఎంపీల మద్దతుతో మన్మోహన్ మరోసారి ప్రధాని అయ్యారు. కాంగ్రెస్కు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 33 స్థానాలు లభించాయి! సీపీఎం సారథ్యంలోని థర్డ్ ఫ్రంట్కు 78 సీట్లొచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన 2001 జనాభా లెక్కల ఆధారంగా 2008లో లోక్సభ స్థానాల పునర్విభజన జరిగింది. ఇది కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందంటారు. 499 స్థానాల స్వరూపం మారింది. ఆ మేరకు ఓటర్ల జాబితాల్లోనూ మార్పుచేర్పులు చేయాల్సి వచ్చింది. కుంభకోణాలతో అప్రతిష్ట యూపీఏ పాలనలో అతి పెద్ద కుంభకోణాలు వెలుగు చూశాయి. 2జీ స్కాం వీటిలో ముఖ్యమైనది. డీఎంకే నేత ఎ.రాజా టెలికం మంత్రిగా ఉండగా 2008లో 122 కొత్త టెలికం లైసెన్స్లు జారీ చేశారు. అనుభవం లేని కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టినట్టు ఆరోపణలొచ్చాయి. దాంతో ఖజానాకు ఏకంగా రూ.1.76 లక్షల కోట్ల నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. 2004–11 మధ్య 194 బొగ్గు గనులను వేలం వేయకుండా కేటాయించడం వల్ల మరో రూ.1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు తేల్చింది! విశేషాలు 2009 సార్వత్రిక ఎన్నికలు ఇద్దరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల సారథ్యంలో జరగడం విశేషం! ఏప్రిల్ 20న తొలి దశ పోలింగ్ ఎన్.గోపాల స్వామి ఆ«ధ్వర్యంలో, మిగతా దశలు నవీన్ చావ్లా పర్యవేక్షణలో జరిగాయి. వీరి విభేదాలు సంచలనంగా మారాయి. ఏప్రిల్ 20న రిటైరైన గోపాలస్వామి, ఆలోగా ఒక విడత పోలింగైనా నిర్వహించాలని భావించారు. దాన్ని ఎన్నికల కమిషనర్గా చావ్లా వ్యతిరేకించడం, ఆయన్ను తొలగించాలంటూ రాష్ట్రపతికి గోపాలస్వామి సిఫార్సు చేయడం కలకలం రేపింది. ► 2009 ఎన్నికల్లో ఏకంగా 114 మంది అభ్యర్థులు కేవలం 3 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ►యూపీఏ తొలి ఐదేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 9.8 శాతంతో ఆల్టైం గరిష్టానికి చేరింది. ► 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని యూపీఏ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించింది. ఫొటో ఓటర్ జాబితాలు ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్ల స్టాంప్ సైజు ఫొటోలతో జాబితాలను ప్రవేశపెట్టింది. దాంతో 2009 లోక్సభ ఎన్నికలను ఫొటో ఓటర్ల జాబితాలతో జరిగాయి. అప్పటిదాకా వాటిపై కేవలం పేర్లే ఉండేవి. అయితే అసోం, నాగాలాండ్, జమ్మూ కశీ్మర్లో మాత్రం ఫొటోల్లేని జాబితాలనే ఉపయోగించారు. 15వ లోక్సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 543) పార్టీ స్థానాలు కాంగ్రెస్ - 206 బీజేపీ - 116 ఎస్పీ - 23 బీఎస్పీ - 21 జేడీయూ - 20 టీఎంసీ - 19 డీఎంకే - 18 బిజూ జనతాదళ్ - 14 శివసేన - 11 ఇతరులు - 86 స్వతంత్రులు - 9 -
సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదు
శ్రీరంగరాజపురం (చిత్తూరు జిల్లా): ‘విలువలు లేని వ్యక్తులతో కలసి మేం పనిచెయ్యం. కూటమి అభ్యర్థి థామస్ వ్యవహారశైలితో విసిగిపోయాం. ఇక మీదట సైకిల్ ఎక్కేది లేదు... ప్రచారం చేసేది లేదు’ అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి యుగంధర్, బీజేపీ ఇన్చార్జి రాజేంద్రలు స్పష్టంచేశారు. ఈ మేరకు ఎస్ఆర్ పురం మండలం కటికపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో తీర్మానం కూడా చేశారు.ఈ సందర్భంగా యుగంధర్, రాజేంద్ర మాట్లాడుతూ కూటమి అభ్యర్థి థామస్ వ్యవహార శైలి చూస్తుంటే బీజేపీ, జనసేన మద్దతు అవసరం లేదని పరోక్షంగా చెబుతున్నట్లు ఉందన్నారు. థామస్ నామినేషన్ రోజు తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కనీసం తాగునీరు, భోజనం కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పార్టీల ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారానికి వెళితే... ‘థామస్ కనీసం పలకరించడం లేదు. చూసీ చూడనట్లు నటిస్తున్నాడు. మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నాడు. అసలు ఎందుకు వచ్చారు.. అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. మాకు గౌరవం ఇవ్వని అభ్యర్థికి మేం మద్దతుగా ఉండలేం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వబోం అని తీర్మానం చేశాం’ అని వివరించారు. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి వారి పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడా కలుపుకుని ప్రచారంలో దూసుకువెళుతున్నారని, టీడీపీ అభ్యర్థికి మాత్రం ఎవరిపైనా గౌరవం లేదన్నారు. థామస్ వ్యవహారశైలిపై బీజేపీ, జనసేన అధిష్టానాలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల బీజేపీ, జనసేన అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చేవెళ్ల రణక్షేత్రం..సంపన్నుల సమరం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టి చేవెళ్లపైనే ఉంది. పల్లె, పట్టణాల కలబోతతో కూడిన ఈ లోక్సభ స్థానంలో మూడు ప్రధాన పార్టీలే కాదు.. ముగ్గురు సంపన్నులు పోటీ పడుతుండటమే ఇందుకు కారణం.గులాబీ కోటలో కమలం పువ్వును వికసింపజేయాలని బీజేపీ.. హస్తం హవా కొనసాగించాలని కాంగ్రెస్ భాస్తోంది. 2009లో మినహా ఇప్పటివరకు ఇక్కడ ఏ ఎన్నిక వచ్చినా కారుదే హవా. ఈసారి ఎలాగైనా కారు స్పీడ్కు బ్రేకులు వేయాలని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. అయితే ఒకసారి గెలిచిన వారు రెండోసారి విజయం సాధించిన చరిత్ర లేకపోవడంతో ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అంచనాలకు అందవు.. వ్యూహాలకు చిక్కరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, అనుబంధ పరిశ్రమలకు నెలవైన చేవెళ్ల లోక్సభ స్థానంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లే కాదు.. ఉత్తరాది ఓటర్లు కూడా ఉన్నారు. వారిలో ముస్లింలు 15 శాతం, ముదిరాజ్లు 15 శాతం, మాదిగలు 15.71 శాతం, గౌడ్లు 9.50 శాతం, మాలలు 7.86 శాతం, యాదవులు 7.86 శాతం, లంబాడీలు 6.57 శాతం, రెడ్లు 5 శాతం, కమ్మలు 3.43 శాతం, లింగాయత్లు 3.36 శాతం, మున్నూరుకాపులు 3 శాతం ఓటర్లు ఉన్నట్లు అంచనా.అభ్యర్థుల గెలుపోటములను ముస్లింలు, ముదిరాజ్లే డిసైడ్ చేయనున్నారు. అయితే ఓటర్ల తీరు అంచనాలకు అందడం లేదు. రాజకీయ వ్యూహాలకు కూడా చిక్కడం లేదు. 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన ఈ మూడు ఎన్నికల్లో ఇదే అంశం స్పష్టమైంది. 2009లో కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి ఇక్కడ గెలవగా ఆ తర్వాత ఆయన మళ్లీ ఈ స్థానం నుంచి పోటీ చేయలేదు. 2014లో బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు నెలకొనగా కాంగ్రెస్ అభ్యర్థి ఎస్. జైపాల్రెడ్డి 18,532 ఓట్ల ఆధిక్యంతో జితేందర్రెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడ 64.5 శాతం పోలింగ్ నమోదైంది. ఇద్దరి అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 1.7 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఓట్లు: 16,81,664 పోలైన ఓట్లు: 10,83,490 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం ఎస్.జైపాల్రెడ్డి కాంగ్రెస్ 4,20,807 38.80 ఏపీ జితేందర్రెడ్డి టీడీపీ 4,02,275 37.102014 ఎన్నికల్లో 60.20 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో నోటాకు 10,018 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి 73,023 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల కార్తీక్రెడ్డిపై గెలిచారు. మొత్తం ఓట్లు: 23,02,163 పోలైన ఓట్లు: 13,00,194 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం కొండా విశ్వేశ్వర్రెడ్డి టీఆర్ఎస్ 4,35,077 33.10 పి.కార్తీక్రెడ్డి కాంగ్రెస్ 3,62,054 27.50 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గెలుపు దోబూచులాడింది. చివరికి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి 1.1 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. నోటాకు 9,244 ఓట్లు పోలయ్యాయి.మొత్తం ఓట్లు: 21,85,179 పోలైన ఓట్లు: 13,15,862 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం జి.రంజిత్రెడ్డి టీఆర్ఎస్ 5,28,148 40.60 కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ 5,13,831 39.05 ముగ్గురూ కోటీశ్వరులే.. కొండా విశ్వేశ్వర్రెడ్డి (బీజేపీ) రూ.4,490 కోట్లు గడ్డం రంజిత్రెడ్డి (కాంగ్రెస్) రూ.869.77 కోట్లుకాసాని జ్ఞానేశ్వర్ (బీఆర్ఎస్) రూ. 520.70 కోట్లు అభ్యర్థులు వారే.. పార్టీలే వేరు ప్రస్తుతం బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గతంలో వేర్వేరు పార్టీల నుంచి తలపడిన వారే. ప్రస్తుతం వారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకుతోపాటు రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల, శేరిలింగంపల్లి, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముస్లిం ఓటర్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు హామీని ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రధాని మోదీపైనే భారం వేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి అర్బన్ ఏరియాల్లో ఉన్న బీజేపీ కేడర్, మోదీ అభిమానులను ఆయన టార్గెట్గా ఎంచుకున్నారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరులో వ్యక్తిగత పరిచయాలను నమ్ముకున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, శాసనమండలి సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ పూర్తిగా బీసీ ఓటర్లనే నమ్ముకున్నారు. లోక్సభ స్థానంలో 16.50 లక్షల బీసీలు ఉంటారని, వారే తనను గెలిపించనున్నారనే ధీమాతో ఉన్నారు. -
అలాగైతే తప్పుకుంటా
కరీంనగర్ టౌన్, సిరిసిల్ల: రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచే తప్పుకుంటా... నిరూపించకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్తోపాటు తెలంగాణ ఉద్యమకారుడు కుమార్ తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహా్వనించారు. బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కుట్రలతో నన్ను ఓడించాలని చూస్తుండ్రు కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చీకటి ఒప్పందాలతో తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని బండి సంజయ్కుమార్ ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటుకు రూ.వెయ్యి పంచి గెలవాలని యత్నిస్తున్నారని నిందించారు. ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని, ఆయన తిట్లు దీవెనలుగా భావిస్తున్నానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వెధవ అంటే తన దృష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వరి్ధల్లు’అని అర్థమన్నారు. పరారీలో దోచుకున్న కుటుంబం మొన్నటివరకు బోయినపల్లిలో ఒక కుటుంబం అరాచకంగా వ్యవహరించిందని, కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారని సంజయ్ ఆరో పించారు. ఇప్పుడు ఆ కుటుంబం పరారీలో ఉందని, వత్తాసు పలికిన పోలీసుల పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. కేసీఆర్కు దోచిపెట్టడం తప్ప.. కుటుంబానికి దాచిపెట్టడం తప్ప వినోద్కుమార్ సాధించేదేమీ లేదని సంజయ్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ‘సెస్’మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్ పాల్గొన్నారు. -
రేవంత్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్, సిద్దిపేటజోన్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవి నుంచి దింపేస్తారనే భయం రేవంత్రెడ్డికి పట్టుకుందని, అందుకే ఇచ్చిన హామీలు, పరిపాలనపై మాట్లాడాల్సిన ఆయన అసహనంతో తిట్ల దండకాన్ని అందుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. శనివారం కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే ప్రధాని మోదీని సీఎం బడేబాయి అంటున్నారని, రేవంత్రెడ్డి ఓ ఫైటర్ అని బండి సంజయ్ పొగుడుతున్నారని, రేవంత్రెడ్డి బీజేపీలోకి రావాలని ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి ఎవరు బీ టీమ్నో అర్థం అవుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దోస్తీకు బోలెడు కారణాలు ఉన్నాయని, కరీంనగర్తోపాటు అనేక సీట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరిస్తోందన్నారు. నన్ను తిట్టినా ఫర్వాలేదు.. హామీలు అమలు చేయండి: హరీశ్ ‘‘నేను కొత్త డిమాండ్లను అమలు చేయమని అనలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడుగుతున్నా. దానికి మీరు. మీ మంత్రులు నన్ను తిడుతున్నారు. నన్ను ఎంత తిట్టినా, ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా.. హామీలు అమలయ్యే వరకు అడుగడుగునా నిలదీస్తా’’అని హరీశ్రావు అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారంటీలు అమలయ్యేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నాడు ఓటుకు నోటు అయితే.. నేడు ఓటుకు ఒట్టు అని ఎద్దేవా చేశారు. సీఎం సవాల్ మేరకు అమరవీరుల స్తూపం వద్దకు తాను రాజీనామాతో వస్తే రేవంత్ మొఖం చాటేశారని విమర్శించారు. రాజీనామా ఎలా చేయాలో తనకు తెలుసని, పదవులు ముఖ్యం కాదని, ప్రజా ఆకాంక్షలే ముఖ్యమని పేర్కొన్నారు.గతంలో వచ్చిన తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోరితే రేవంత్రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి మోసం చేసి పారిపోయారని విమర్శించారు. అప్పట్లో కిషన్రెడ్డి రాజీనామా చేయలేదని అలాంటి వారు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు అని మండిపడ్డారు. కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని, లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా సరిపోతుందంటూ అందుకు కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హరీశ్ ఆరోపించారు.
Related News by category
-
కూటమికి బీఎస్పీ పోటు!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ కోటను బద్దలు కొట్టాలన్న విపక్ష ఇండియా కూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లేలా కని్పస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాలఓల బీజేపీని నిలువరించేందుకు ఓట్ల సమీకరణకు కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. ఆ ప్రయత్నాలను వమ్ము చేసేలా బీఎస్పీ వ్యవహరిస్తోంది.ముఖ్యంగా యూపీలో ముస్లిం ఓట్ల సమీకరణతో బీజేపీ స్థానాలకు భారీగా గండి కొట్టాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. కానీ ముస్లిం ఓట్లను నిలువునా చీల్చేలా రాష్ట్రంలో బీఎస్పీ ముస్లింలకు ఎక్కువ టికెట్లిచ్చింది! అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన బీస్పీ లోక్సభ ఎన్నికల్లోనైనా ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇండియా కూటమికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. యూపీలో కూటమికి దెబ్బే! అత్యంత కీలకమైన యూపీలో 80 స్థానాలకు గానూ బీజేపీ ఈసారి సొంతంగానే 70 సీట్లపై గురిపెట్టింది. పొత్తులో భాగంగా కట్టిన కాంగ్రెస్ 13, ఎస్పీ 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో 21 శాతమున్న యాదవ ఓట్లకు 19 శాతం ముస్లిం ఓట్లు కలిస్తే భారీగా ఓట్లు రాలుతాయని ఆశ పడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 18 జిల్లాల పరిధిలోని పలు లోక్సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. వీటిలో పలు జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 30 శాతం పైగా ఉంది. వీరంతా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సంప్రదాయ ఓటు బ్యాంకే.దాంతో ముస్లింల ఓట్లను సంఘటితంగా తమవైపు సమీకరించుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ వారికి 11 సీట్లు కేటాయించాయి. మాయా నిర్ణయాలు వాటి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉన్నాయి. బీఎస్పీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో ముస్లింలకే టికెట్లిచ్చింది! దాంతో ముస్లిం ఓట్లకు గండిపడి ఎస్పీ/కాంగ్రెస్ అభ్యర్థుల అవకాశాలకు గండిపడేలా కని్పస్తోంది. ఇక దళిత ప్రాబల్య పశ్చిమ యూపీలో వాటి ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్/ఎస్పీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే అక్కడా బీఎస్పీ ప్రచారాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్పై ముప్పేట దాడి కొనసాగిస్తోంది. ఇది వాటికి మరో తలనొప్పిగా మారింది. రాజస్థాన్లోనూ బీఎస్పీ ఆరుచోట్ల ముస్లింలకు టికెటిచ్చింది! మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలోనూ ఇదే పరిస్థితి! లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ప్రదర్శన ఎన్నికలు సీట్లు ఓట్ల శాతం 2004 19 5.33 2009 21 6.17 2014 0 4.19 2019 10 3.67 ప్రభావం తగ్గలేదు బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్రంలో 21 శాతమున్న ఎస్సీల్లో సగానికి పైగా జాతవ్లే. ఆ కులం నుంచి వచ్చిన మాయావతికి వారిపై పట్టు ఉంది. కానీ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గడంతో మాయా ప్రభను కోల్పోయారు. 2017లో బీఎస్పీకి 19 సీట్లు రాగా 2022లో ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది! కాకపోతే ఆ ఎన్నికల్లో బీఎస్పీ 12.88 శాతం ఓట్లు సాధించింది.ఇక 2004 లోక్సభ ఎన్నికల్లో 19, 2009లో 21 సీట్లు సాధించిన బీఎస్పీ, 2014లో మాత్రం ఖాతాయే తెరవలేకపోయింది. 2019లో ఎస్పీ, రాష్ట్రయ లోక్దళ్తో పొత్తుల వల్ల 10 సీట్లు గెలుచుకుంది. కానీ వారిలో ఐదుగురు ఎంపీలు పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో మాయవతి ఒంటరిగా పోరాడుతున్నారు. యూపీలో 80 స్థానాలకు గానూ 64 చోట్ల అభ్యర్థులను నిలిపారు. అలాగే రాజస్థాన్లో 25, మధ్యప్రదేశ్లో 7, ఛత్తీస్గఢ్లో 8 స్థానాల్లోనూ బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈసారి కూడా ముస్లిం దళిత ఫార్ములాతోనే ఆమె బరిలో దిగారు. ఆమె ప్రచార సభలకు జనం భారీగా వస్తున్నారు. దాంతో మాయా దెబ్బకు మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ తదితర విపక్షాలు భయపడుతున్నాయి. -
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
కొల్హాపూర్/గోవా: కేంద్రంలో విపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులు కుర్చీ ఎక్కుతారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచే అవకాశమే లేనప్పటికీ ఎవరెప్పుడు ప్రధాని కావాలన్న దానిపై ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను దేశం భరించబోదని అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్తోపాటు గోవాలో ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. కర్ణాటకలో ఓబీసీల జాబితాలో ముస్లింలను చేర్చారని తప్పుపట్టారు. దీంతో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక మోడల్ దేశమంతటా అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. సామాజిక న్యాయాన్ని హత్య చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమా? అని నిలదీశారు. కాంగ్రెస్కు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలే తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. వారసత్వ పన్ను విధించి జనం ఆస్తులు లాక్కోవాలని చూస్తున్న పార్టీలను అధికారానికి ఆమడ దూరంలో ఉంచాలని ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నించింనందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికలు రెండు శిబిరాల మధ్య జరుగుతున్నాయని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్న ఎన్డీయే ఒకవైపు, సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఉందని పేర్కొన్నారు. -
‘అర్బన్ నక్సల్స్’ను ఎన్నుకుని పొరపాటు చేయొద్దు
భరూఛ్: ఓటు వేసి అర్బన్ నక్సలైట్లను ఎన్నుకునే పొరపాటు ఎప్పుడూ చేయొద్దని గుజరాత్ ఓటర్లకు బీజేపీ అగ్రనేత అమిత్ షా హితవు పలికారు. గుజరాత్లోని భరూఛ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ మన్సుఖ్ వాసావా తరఫున శనివారం ఎన్నికల ర్యాలీలో అమిత్షా మాట్లాడారు. ‘‘ మన్సుఖ్లాంటి చక్కని ప్రజా ప్రతినిధి ఇంకొకరు మీకు దొరకదు. పొరపాటున వేరేవాళ్లకు ఓటేస్తే అర్బన్ నక్సలైట్లలో ఒకరు ఎంపీ సీటులో కూర్చుంటారు. ఈ గిరిజన ప్రాంతాన్ని నాశనం చేస్తారు. ప్రజలను లూటీచేసేందుకు ఆప్, కాంగ్రెస్ కలిసి వచ్చాయి. కాంగ్రెస్ గిరిజనుల వ్యతిరేక పార్టీ.ఓట్లేశాక ఆప్ గిరిజనులను గాలికొదిలేస్తుంది. 400 మెజారిటీతో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆప్, కాంగ్రెస్ చెప్పేవన్నీ అసత్యాలు. అబద్ధాలు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ నైపుణ్యం సాధించింది. ఆప్ సర్దార్ స్థాయికి ఎదిగింది. నిజంగానే మేం రాజ్యాంగాన్ని మార్చేవారమే అయితే ఈ పదేళ్లు అధికారంలో ఉన్నపుడే మార్చేవాళ్లంకదా?’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఆదివాసీలు, దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను మేం ముట్టుకోబోం.ఎవరినీ ముట్టుకోనివ్వం కూడా. గిరిజనుల ప్రాథమిక హక్కులను ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) లాగేసుకుంటుందని ఆప్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. యూసీసీకి గిరిజనులకు సంబంధమే లేదు. భరూఛ్లో ఆప్ అభ్యర్థి ఛైతర్ వాసావా లేనిపోనివి ప్రచారంచేస్తున్నారు. ఆదివాసీలకు మోదీ ఎల్లప్పుడూ మిత్రుడే’’ అని అమిత్ షా చెప్పారు. -
ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అలవికాని హామీలిస్తూ.. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చని చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... ఈసారి మరిన్ని మోసపూరిత హామీలతో ముందుకు వచ్చే ప్రమాదం కనిపిస్తోందని, అంతా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. ఇప్పటిదాకా చంద్రబాబు ఇచ్చిన హామీలకే తాము వెచ్చిస్తున్న మొత్తం కన్నా దాదాపు రెట్టింపు అవుతోందని, ఇది నెరవేర్చే అవకాశం లేకపోయినా.. తాను సంపద సృష్టించి ఇవన్నీ చేస్తానని బాబు మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రతి సందర్భంలోనూ ‘నేను సంపద సృష్టిస్తా.. సంపద సృష్టిస్తా’ అని చంద్రబాబు అరిచే అరుపుల వెనక మర్మాన్ని ముఖ్యమంత్రి శనివారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా గణాంకాలతో సహా వివరించారు. అవి ఆయన మాటల్లోనే... జగన్ అబద్ధాలు చెప్పడు... వీళ్లంతా కూడా అబద్ధానికి రెక్కలు కట్టి ఎలా మోసం చేస్తారో తెలియజేయడానికే ఇదంతా చెబుతున్నా. ఇది ధర్మమేనా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలచుకున్నా. నేను చేయలేకపోతే చేయలేనని చెబుతా. అంతే తప్ప అబద్ధాలు ఆడను. మోసం చెయ్యను. పేదలను ప్రేమించే, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా, పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ వేయలేదు. వేయలేరు కూడా. మేనిఫెస్టోలో లేనివి కూడా... ఈ 58 నెలల కాలంలో మేనిఫెస్టోలో లేని అంశాలెన్నిటినో అమల్లోకి తెచ్చాం. కాపునేస్తం, ఈబీసీ నేస్తం, పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద ఇవేవీ 2019 మేనిఫెస్టోలో లేవు. కానీ ఇప్పుడు అమలవుతున్నాయి. అలాగే పిల్లలకు ట్యాబ్లు, ఆరోగ్య శ్రీని రూ.25లక్షలకు పెంచటం, 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటం... ఇవన్నీ మేనిఫెస్టోలో చెప్పకుండానే చేసి చూపించాం. అందుకే చెబుతున్నా. అబద్ధాలు చెప్పి నేను చంద్రబాబుతో పోటీ పడదల్చుకోలేదు. కారణం... అది అబద్ధమని తెలిసి కూడా చెప్పటం ధర్మం కాదు కాబట్టి. చేయగలిగిందే చెబుతా. అవకాశం ఉంటే పేదల కోసం పది అడుగులు ముందుకే వేస్తా. 14 ఏళ్ల పాలనలో ఎప్పుడూ రెవెన్యూ లోటే... జగన్ చేయలేకపోయాడు. నేను సంపద సృష్టిస్తాను కనుక చేయగలుగుతానని చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ అంటుంటాడు. అలా తాను చెప్పే అబద్ధాలి్న, చేసే మోసాల్ని నిస్సిగ్గుగా డిఫెండ్ చేసుకుంటాడు. మరి తన 14 ఏళ్ల పాలనలో ఏ సంపద సృష్టించాడు? అసలు ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ప్రతి ఏటా లోటే కదా? మరి రెవెన్యూ వ్యయానికే రెవెన్యూ లోటు అవుతున్నప్పుడు... సంపద ఎక్కడ నుంచి సృష్టించారు? మరి చంద్రబాబు అధికారంలో లేక ముందు గానీ... తర్వాత గానీ ఎప్పుడు చూసినా రెవెన్యూ మిగులు కనిపిస్తుంది. ఇదీ వాస్తవం.అసలు ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ లోటు అన్నది ఒక్క చంద్రబాబు పాలనలోనే కనిపిస్తుంది. అంటే లెక్కలన్నీ చంద్రబాబు సంపద సృష్టించలేదని చెబుతున్నాయి. ఎందుకంటే ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు. సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. తన 14 ఏళ్ల పాలనంతా దోచుకోవడం, దాన్ని పంచుకోవటమే జరిగింది కాబట్టే ఇదంతా. బాబు చేయలేనిది నేను ఎందుకు చేయగలిగానంటే ఇక్కడ కరప్షన్ లేదు. వివక్ష లేదు. అందుకే!. అడ్డగోలు అప్పులు తెచ్చింది బాబేగా? అప్పులపై నోటికొచ్చింది చెబుతున్నారు. కానీ లెక్కలు మారవు కదా? ఎవరెంత అప్పులు చేశారో ఒకసారి గమనిస్తే... 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్రేట్ (సీఏజీఆర్) 21.87 శాతం. కానీ 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. మరి ఎక్కువ అప్పులు తెచ్చిందెవరో తెలియటం లేదా? అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు పాలన 2019 మే వరకు జరిగింది. ఆయన అధికారంలోకి రాకముందు రూ.1.18 లక్షల కోట్లు అప్పుంటే... 2019 నాటికి రూ.2.71 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇక గవర్నమెంట్ గ్యారంటీడ్ రుణం... బాబు రాకముందు రూ.14వేల కోట్లు. బాబు దిగిపోయే నాటికి రూ.59వేల కోట్లు. ఇక ప్రభుత్వ గ్యారంటీ లేని పీఎస్యూల రుణాలు రూ.21,367 కోట్ల నుంచి రూ.81,337 కోట్లకు పెరిగాయి. మొత్తంగా అప్పులు బాబు హయాంలో రూ.1,53,346 కోట్ల నుంచి 4,12,288 కోట్లకు పెరిగాయి. ఇక ఈ ప్రభుత్వ హయాలలో చూస్తే ప్రభుత్వ రుణాలు రూ.4.90 లక్షల కోట్లకు, గ్యారంటీడ్ రుణాలు 1.43 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వ గ్యారంటీ లేని పీఎస్యూల అప్పులు రూ.69,372 కోట్లకు తగ్గాయి. మొత్తమ్మీద రుణాలు రూ.7,03,471 కోట్లకు చేరాయి. బాబు హయాంలో పెరుగుదల రేటు 21.87 శాతం ఉంటే... ఇప్పుడది 12.13 శాతం. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికుంది? జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగిందెప్పుడు? పురోగతి అంటే ఏంటి? దేశ ఖజానాకు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం? జీడీపీలో మన రాష్ట్ర వాటా ఎంత? ఇవన్నీ చూడాలి కదా!! వాస్తవానికి చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో మన వాటా 4.47 శాతం ఉంటే.. అది ఇప్పుడు సగటున 4.83 శాతానికి పెరిగింది. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలియటం లేదా? ఆస్తుల కల్పన ఎవరి హయాంలో జరిగిందో తెలియటం లేదా? ఎవరి హయాంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ బ్రహ్మాండంగా పరుగెత్తుతున్నాయో తెలియటం లేదా? మూలధన వ్యయం... మాటల్లోనేనా? డబ్బులన్నీ పంచేస్తున్నారంటూ చంద్రబాబు అడ్డగోలు ఆరోపణలకు దిగుతున్నాడు. ఎప్పుడైనా తను చెప్పేదొక్కటే. తాను స్కీములకు కాదని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (మూలధన వ్యయం) రూపంలో ఖర్చు చేశానని. అందుకనే ఇన్ని స్కీములు ఇవ్వలేకపోయానంటాడు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే... అసలు నాడు–నేడు ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో ఆసుపత్రులు, స్కూళ్లు బాగుపడ్డాయి? ఎవరి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది? ఆయన హయాం చూస్తే మూలధన వ్యయం కింద ఏడాదికి రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... మన ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.17,757 కోట్లు చేస్తున్నాం. కొత్తగా 4 సీపోర్టులు కడుతున్నాం. 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడుతున్నాం. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ‘నాడు–నేడు’తో స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు కళ్లెదుటే జరుగుతున్నాయి. నిజానికి మనమంతా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ నీడన గడిచిపోయాయి. ఆ రెండేళ్లూ రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా మూలధన వ్యయం కింద ఇంత భారీగా ఖర్చు చేయగలిగాం. పైపెచ్చు ఏ ఒక్క పథకాన్నీ ఆపలేదు. ఇదీ జగన్ పనితీరుకు, చంద్రబాబు పనితీరుకు తేడా!. పన్నుల బాదుడులోనూ చంద్రబాబే టాప్... చంద్రబాబు ప్రతిసారీ జగన్ ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నాడని. పన్నులతో బాదేస్తున్నాడని అంటున్నారు. కానీ నిజానికి జీఎస్డీపీలో పన్నుల ద్వారా వచ్చే మొత్తం ఎవరి హయాంలో ఎక్కువో తెలుసా? చంద్రబాబు నాయుడి హయాంలో జీఎస్డీపీలో ట్యాక్స్ బర్డెన్ 6.57 శాతం. జగన్ హయాంలో అది 6.35 శాతమే. మరి ఎవరు ట్యాక్సులతో బాదారయ్యా? ఇవన్నీ కూడా ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్లలో చెప్పినవే కదా? -
కళింగ యుద్ధం!
పోలింగ్ తేదీలు: మే 13, 20, 25, జూన్ 1సర్వేలు ఏం చెబుతున్నాయి... బీజేడీకి 11, బీజేపీకి 10 లోక్సభ స్థానాలు రావొచ్చని సర్వేలు అంచనా వేశాయి. అసెంబ్లీలోనూ బీజేపీ–బీజేడీ మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చని అంచనా. బీజేడీనే అధికారాన్ని నిలబెట్టుకున్నా బీజేపీకి 60 సీట్ల వరకు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన ఒడిశాలో పాతికేళ్లుగా బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నయక్ ఏకఛత్రాధిపత్యం సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లోనూ ప్రతిసారీ మెజారిటీ స్థానాలు బీజేడీకే దక్కుతున్నాయి. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. రాష్ట్రంలో పాగా వేసేందుకు బలమైన పునాదులు ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రంలో మళ్లీ సత్తా చాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ‘కళింగ’ యుద్ధంలో ఈసారి మూడు పార్టీలూ హోరాహోరీగా తలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ ఒడిశాలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేడీకి ఊహించని షాక్ తగిలింది. మొత్తం 21 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి 12 సీట్లకే పరిమితమైంది. 8 సీట్లు కోల్పోయింది. బీజేపీ కూడా ఒంటరిగా బరిలో నిలిచి 8 స్థానాలు కొల్లగొట్టింది! 2014 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న కాషాయ పార్టీ ఏకంగా 7 సీట్లను పెంచుకుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి పూర్తిగా చేతులెత్తేసింది. కాంగ్రెస్ 18 చోట్ల పోటీ చేసినా ఒక్క సీటుకే పరిమితమైంది. సీపీఐ, సీపీఎం, జేఎంఎం సున్నా చుట్టాయి. నవీన్ మ్యాజిక్... సీఎంగా, కేంద్ర మంత్రిగా వెలుగు వెలిగిన బిజూ పట్నయక్ కుమారుడైన నవీన్ 1997లో జనతాదళ్ను వీడారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) పేరుతో పార్టీ పెట్టి తిరుగులేని శక్తిగా అవతరించారు. ఒడిశా అంటే నవీన్ పట్నయక్ అనే స్థాయిలో పాతికేళ్లుగా పాతుకుపోయారు. వరుసగా ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా కొనసాగుతున్న రెండో వ్యక్తిగా (సిక్కింలో పవన్ చామ్లింగ్ తర్వాత) నిలిచారు. తొలుత కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చేరిన నవీన్ వాజ్పేయి ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా చేశారు. 2000 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో మెజారిటీ సీట్లను గెల్చుకుని తొలిసారి ఒడిశా సీఎం అయ్యారు. నాటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 2004లో ఎన్డీఏ కేంద్రంలో అధికారం కోల్పోయినా ఒడిశాలో మాత్రం నవీన్ జోరు తగ్గలేదు. 2008లో కొంధొమాల్ జిల్లాలో అల్లర్ల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని వీడారు నాటినుంచీ ఒంటరిగానే పోటీ చేస్తూ వస్తున్నారు. లోక్సభ పోరులో తడబాటు 2019లోనూ ఒడిశాలో జమిలి ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీలో 147 స్థానాలకు 112 చోట్ల నెగ్గిన బీజేడీ లోక్సభ పోరులో 12 సీట్లకు పరిమితమైంది. అనూహ్యంగా 8 సీట్లకు ఎగబాకిన బీజేపీ, అసెంబ్లీలో కూడా బలాన్ని 10 నుంచి 23 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్ కేవలం 9 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్డీఏకు దూరంగా ఉన్నా పార్లమెంట్లో పలు కీలక బిల్లులపై ఎన్డీఏకు బీజేడీ మద్దతు కొనసాగిస్తూనే ఉంది! 15 ఏళ్ల తర్వాత నవీన్ మరోసారి ఎన్డీఏలో చేరేలా కని్పంచినా చివరికి ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించారు. ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి ఎజెండాను నవీన్ ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అభివృద్ధే మా నినాదం, గుర్తింపు. దీనికి ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ప్రతిదీ రాజకీయం చేస్తూ ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్నాయి. అభివృద్ధి నిరోధకులుగా మారాయి. వాటి అసలు రంగేమిటో ఒడిశా ప్రజలకు తెలుసు. వచ్చే పదేళ్లను ‘ఒడిశా దశాబ్ది’గా మార్చి చూపిద్దాం. 2036 నాటికి రాష్ట్రాన్ని దేశంలో నంబర్వన్గా నిలిపేందుకు పునరంకితమవుదాం. – హింజిలిలో ఎన్నికల ప్రచార ప్రారంభం సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్ ఒడిశాలో రాష్ట్రాన్ని నడుపుతున్నది అధికారులే. బీజేడీ ప్రభుత్వం పూర్తిగా చతికిలపడింది. అపారమైన ఖనిజ వనరులున్నా రాష్ట్ర ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. నవీన్ పట్నయక్కు పాతికేళ్లు అధికారం కట్టబెట్టారు. మాకు ఐదేళ్లు అవకాశమివ్వండి. 20 ఎంపీ స్థానాల్లో గెలిపించండి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. – సోనేపూర్ ఎన్నికల సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండియా కూటమి పోటీ ఇచ్చేనా...! కాంగ్రెస్ పరిస్థితి ఒడిశాలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. నాయకత్వం లేమితో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రెండింట్లోనూ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈసారి కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ఆశ పడుతోంది. ఒడిశాలో 93 శాతం హిందువులే. 3 శాతం క్రైస్తవులు, 2.5 శాతం మేర ముస్లింలున్నారు.హిందూ జనాభాలో 40 శాతం ఆదివాసీలు, దళితులు. వీరిలో ఎస్టీలు 23 శాతముంటారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ ఓట్లే లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త కులగణన అస్త్రం ఒడిశాలో బాగా కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 6 న్యాయాలు, 25 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇండియా కూటమిలో భాగంగా జేఎంఎం, సీపీఐ, సీపీఎంతో కలిసి పోటీ చేస్తోంది. మోదీ హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్పొరేట్లతో కుమ్మక్కు అంశాలను కూడా గట్టిగా ప్రచారం చేస్తోంది. బీజేపీలోకి వలసల జోరు బీజేపీకి ఒడిశాలో ఒకప్పుడు సరైన ప్రాతినిధ్యమే లేదు. అలాంటిది ఇప్పుడు లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీతో నువ్వా నేనా అన్నట్టుగా తలపడే స్థాయికి చేరింది. మోదీ ఫ్యాక్టర్తో పాటు అభివృద్ధి ఎజెండా, రామమందిర అంశంతో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టేలా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈసారి ఎంపీ సీట్లను రెండంకెలకు పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేడీ నుంచి పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటుండటం విశేషం. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేడీ నేత అరబింద ధాలి బీజేపీలో చేరారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని బల్లగుద్ది చెబుతున్నారు! కటక్ నుంచి వరుసగా 6 సార్లు ఎంపీగా గెలిచిన బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ కూడా బీజేపీ గూటికి చేరారు. ఆ పార్టీ టికెట్పై అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన ఒడిశా తొలి సీఎం కృష్ణహరి మహతాబ్ కుమారుడు. బీజేడీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సిద్ధాంత్ మహాపాత్ర కూడా కాషాయ జెండా కప్పుకున్నారు. ఆయన బరంపురం నుంచి బీజేడీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కీలక నేతగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఈసారి సంభాల్పూర్ నుంచి బరిలోకి దిగారు. ఆయనను బీజేడీలో నంబర్ టూగా వెలుగుతున్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రణబ్ ప్రకాశ్ దాస్ ఢీకొంటున్నారు. దాంతో సంభాల్పూర్ హాట్ సీట్గా మారింది.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement