Sakshi News home page

నోట్ల రద్దుతో పన్ను ఉగ్రవాదం: యశ్వంత్‌ సిన్హా

Published Tue, Mar 20 2018 2:15 AM

Demonetisation has led to tax terrorism: Yashwant Sinha - Sakshi

న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం పన్ను ఉగ్రవాదానికి దారి తీసిందని బీజేపీ అసమ్మతి నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా విమర్శించారు. పేర్లు ప్రస్తావించకుండానే ప్రధాని మోదీని పిచ్చి తుగ్లక్‌గా పేరుమోసిన 16వ శతాబ్దపు ఢిల్లీ రాజు మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌తో పోల్చారు. ఆర్థిక వేత్త అరుణ్‌ కుమార్‌ రాసిన ‘డీమానెటైజేషన్‌ అండ్‌ ద బ్లాక్‌ ఎకానమీ’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో యశ్వంత్‌ సిన్హా మాట్లాడారు. పెద్దనోట్లను ఉపసంహరించడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయని మోదీ చెప్పారో వాటిలో ఏ ఒక్కటీ జరగలేదన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement